News March 18, 2024
నేటి నుంచి టెన్త్ పరీక్షలు.. ALL THE BEST

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏపీలో 7,23,092 మంది విద్యార్థులు, తెలంగాణలో 5.08 లక్షల మంది హాజరు కానున్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి. తెలంగాణలో విద్యార్థులకు 5 నిమిషాల(ఉ.9.35 వరకు) గ్రేస్ పీరియడ్ ఇవ్వగా.. ఏపీలో లేదు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్టికెట్ చూపించి RTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
Similar News
News December 7, 2025
20 ఏళ్లు దాటిన తర్వాత మహిళలు ఈ టెస్టులు చేయించుకోవాలి

20 ఏళ్ల తర్వాత మహిళల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అందుకే మహిళలు 20 ఏళ్ల తర్వాత కొన్ని పరీక్షలు తప్పకుండా చేయించుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. HPV టెస్ట్, STD టెస్ట్, షుగర్, బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. అలాగే ఎప్పటికప్పుడు నెలసరిని వస్తుందా.. లేదా.. ఏవైనా హార్మోన్ సమస్యలున్నాయా అన్నవీ చెక్ చేసుకోవాలి. వీటితో పాటు హెల్తీ పుడ్, వ్యాయామం చేయడం మంచిదని సూచిస్తున్నారు.
News December 7, 2025
2,757 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)లో 2,757 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. BA, B.com, BSc, డిప్లొమా, టెన్త్, ITI, ఇంటర్ అర్హతగల వారు DEC18 వరకు NAPS/NATS పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18- 24ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://iocl.com *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 7, 2025
ఏపీలో 13, తెలంగాణలో 21న లోక్ అదాలత్

TG: వివాదాలు, కోర్టు కేసులను త్వరగా పరిష్కరించుకునేందుకు డిసెంబర్ 21న రాష్ట్రవ్యాప్తంగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ వెల్లడించింది. సివిల్, చెక్ బౌన్స్, వివాహ సంబంధ వివాదాలు, రాజీపడే అవకాశం ఉన్న క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చని అధికారులు తెలిపారు. అయితే ట్రాఫిక్ చలాన్ల సెటిల్మెంట్ ఉండదని స్పష్టం చేశారు. అటు ఏపీలో ఈ నెల 13న లోక్ అదాలత్ జరగనుంది.


