News March 18, 2024
నేటి నుంచి టెన్త్ పరీక్షలు.. ALL THE BEST

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏపీలో 7,23,092 మంది విద్యార్థులు, తెలంగాణలో 5.08 లక్షల మంది హాజరు కానున్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి. తెలంగాణలో విద్యార్థులకు 5 నిమిషాల(ఉ.9.35 వరకు) గ్రేస్ పీరియడ్ ఇవ్వగా.. ఏపీలో లేదు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్టికెట్ చూపించి RTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
Similar News
News January 20, 2026
LRS.. ఇలా అప్లై చేసుకోండి

AP: 2025 జూన్ 30లోపు రిజిస్టర్ అయిన <<18903924>>ప్లాట్లు<<>> లేదా లే అవుట్లు మాత్రమే క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు. గ్రామ/వార్డు సచివాలయం లేదా ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. lrsdtcp.ap.gov.inలోకి వెళ్లి సేల్ డీడ్, లింక్ డాక్యుమెంట్లు, ప్లాట్ ప్లాన్, ఫొటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫీజులో రూ.10వేలకు తగ్గకుండా ప్రాథమికంగా చెల్లించాలి. ఆ తర్వాత రాయితీ ఇస్తారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అభ్యంతరాలు స్వీకరిస్తారు.
News January 20, 2026
కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్లో 210 పోస్టులు.. అప్లై చేశారా?

<
News January 20, 2026
కురులు ఆరోగ్యంగా ఉండాలంటే..

మనం తినే ఆహారం ద్వారా చేరే పోషకాలను శరీరం ప్రధాన అంతర్గత అవయవాల కోసం కేటాయిస్తుంది. వాటిలో మిగిలినవి మాత్రమే వెంట్రుకలు, గోళ్లకు వెళ్తాయి. సరిపడా పోషకాలు తీసుకోకపోతే వెంట్రుకల మీద ఆ ప్రభావం పడి, రాలిపోతూ ఉంటాయి. కాబట్టి వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే, పోషకాహారంతోపాటు, విటమిన్ ఇ, డి, సి, బి – కాంప్లెక్స్ అందేలా చూసుకోవాలి. ఇందుకోసం తాజా ఆకుకూరలు, కూరగాయలు, మాంసకృత్తులు సరిపడా అందించాలి.


