News March 20, 2025
రేపటి నుంచే టెన్త్ ఎగ్జామ్స్.. ఏర్పాట్లు పూర్తి

TG: రాష్ట్రంలో రేపటి నుంచి ఏప్రిల్ 4 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. 5.09 లక్షల మంది విద్యార్థులు హాజరుకానుండగా 2,650 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఉ.9.30 నుంచి మ.12.30 వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తారు. సెంటర్లలోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు తీసుకెళ్లకూడదు.
* ALL THE BEST
Similar News
News March 21, 2025
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు అదిరిపోయే న్యూస్

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమా డబ్బింగ్ స్టార్ట్ అయినట్లు మూవీ యూనిట్ పేర్కొంది. సాటిలేని హీరోయిజం ప్రయాణం వెండి తెరకు మరింత చేరువైనట్లు పేర్కొంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రానికి కొంత భాగం క్రిష్ దర్శకత్వం వహించగా మిగతా భాగాన్ని తెరకెక్కించే బాధ్యత జ్యోతి కృష్ణ తీసుకున్నారు. కాగా ఈ మూవీ మే 9న థియేటర్లలో విడుదల కానుంది.
News March 21, 2025
బొగ్గు ఉత్పత్తిలో భారత్ రికార్డు: కిషన్ రెడ్డి

బొగ్గు ఉత్పత్తిలో భారత్ 1 బిలియన్ టన్నుల మైలురాయిని అధిగమించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ‘అత్యాధునిక సాంకేతికతలు, సమర్థవంతమైన పద్ధతులతో ఉత్పత్తిని పెంచాం. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్లకు ఇది పరిష్కారం చూపుతుంది. ఆర్థిక వృద్ధిని పెంచడంతో పాటు ప్రతి భారతీయుడికి ఉజ్వల భవిష్యత్తును ఇస్తుంది. మోదీ నాయకత్వంలో గ్లోబల్ ఎనర్జీ లీడర్గా భారత్ ఎదుగుతోంది’ అని ట్వీట్లో పేర్కొన్నారు.
News March 21, 2025
UPI పేమెంట్స్ సబ్సిడీ ఎత్తివేతపై ఇండస్ట్రీ ఆందోళన

రూపే డెబిట్ కార్డులకు GOVT సబ్సిడీ విత్డ్రా చేసుకోవడంపై డిజిటల్ పేమెంట్స్ ఇండస్ట్రీ ఆందోళన చెందుతోంది. ఏటా రూ.500-600CR మేర నష్టం తప్పదని అంచనా వేస్తోంది. FY25లో స్మాల్ మర్చంట్స్ UPI పేమెంట్స్కే కేంద్రం రూ.1500CR కేటాయించింది. గత ఏడాదీ ఇండస్ట్రీ రూ.5500 కోట్లను ఆశించగా రూ.3,681CR ఇవ్వడం గమనార్హం. జీరో MDR వల్ల రూపే కార్డులపై వచ్చే నష్టాన్ని బ్యాంకులు, Fintechsకి కేంద్రం సబ్సిడీగా ఇస్తుంది.