News March 27, 2024

గుండెపోటుతో టెన్త్ అమ్మాయి మృతి

image

AP: పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నాగవరానికి చెందిన టెన్త్ విద్యార్థిని చిన్నారి(15) గుండెపోటుతో మృతి చెందింది. ఆమె స్థానిక హైస్కూల్‌లో చదువుతూ బృగుబండలో టెన్త్ పరీక్షలు రాస్తోంది. ఇవాళ పరీక్షకు హాజరై ఇంటికి రాగానే అస్వస్థతకు గురైంది. వెంటనే చికిత్స కోసం సత్తెనపల్లి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. విద్యార్థిని కొన్నాళ్లుగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు బంధువులు తెలిపారు.

Similar News

News April 11, 2026

ప్యారడైజ్‌లో ‘సుబ్బు’గా కయాదు.. లుక్ అదుర్స్!

image

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కయాదు లోహర్ బర్త్ డే సందర్భంగా నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ప్యారడైజ్’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలోని ‘సుబ్బు’ పాత్రలో నటిస్తున్న కయాదు ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. వైట్& బ్లూ కలర్ డ్రెస్‌లో క్యాప్ ధరించి వింటేజ్ లుక్‌లో సైకిల్‌పై వెళ్తున్న ఈ ముద్దుగుమ్మ లుక్ ఆకట్టుకుంటోంది.

News April 11, 2026

2028 నుంచి పెట్రోల్ బైకుల రిజిస్ట్రేషన్ నో

image

కాలుష్య నివారణే లక్ష్యంగా ఢిల్లీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2026-30ని డ్రాఫ్ట్ చేసింది. 30 రోజుల పాటు నిపుణులు, ప్రజల నుంచి సలహాలు తీసుకొని దాన్ని ఖరారు చేయనుంది. 2028 ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్‌తో నడిచే టూవీలర్లను ఢిల్లీలో రిజిస్టర్ చేయరు. కేవలం ఈవీలు మాత్రమే చేస్తారు. అలాగే ఈవీలు కొనేవారికి భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించింది. 100% రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజును మినహాయించారు.

News April 11, 2026

గ్రాఫిక్స్‌లో ‘రామాయణ’ తగ్గేదేలే!

image

రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ’ సినిమా బాలీవుడ్‌లో కొత్త విజువల్ వండర్‌గా నిలవనుంది. హాలీవుడ్ చిత్రం ‘అవతార్’ తరహాలో అత్యాధునిక VFX, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఈ చిత్రం కోసం ఉపయోగిస్తున్నారు. ఆస్కార్ గెలిచిన DNEG సంస్థ గ్రాఫిక్స్ బాధ్యతలు చూస్తోంది. దాదాపు ₹4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుందని సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.