News March 12, 2025
పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు

AP: రాష్ట్రంలో ఈ నెల 17 నుంచి 31 వరకు జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నారు. 3,450 సెంటర్లలో 6,19,275 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారు. 156 ఫ్లైయింగ్, 682 సిట్టింగ్ స్క్వాడ్స్ పర్యవేక్షిస్తారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ విధిస్తారు. జిరాక్స్, నెట్ సెంటర్లను మూసివేస్తారు. హాల్లోకి చీఫ్ సూపరింటెండెంట్ తప్ప ఎవరూ మొబైల్ తీసుకెళ్లకూడదు. కంట్రోల్ రూమ్ నం. 08662974540.
Similar News
News January 2, 2026
పార్టీయే ప్రాణం.. భర్తకు గుడ్బై!

మహారాష్ట్రలోని నాగ్పూర్ రాజకీయాల్లో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. BJP పట్ల విధేయత కారణంగా మాజీ మేయర్ అర్చన దేహంకర్ తన భర్త వినాయక్ దేహంకర్ను వదిలేసి పుట్టింటికి వెళ్లారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ టికెట్ దక్కకపోవడంతో వినాయక్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడం వివాదానికి దారి తీసింది. దీనిని పార్టీకి వెన్నుపోటుగా ఆమె పేర్కొన్నారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
News January 2, 2026
వంటింటి చిట్కాలు

☛ ఆకుకూరలను సూర్యరశ్మి తగలని ప్రదేశంలో నిల్వ ఉంచాలి. ఒకవేళ సూర్యకాంతి వాటిపై ఎక్కువగా పడితే వాటిలో ఉండే పోషక పదార్థాలు క్రమంగా నశిస్తాయి.
☛ ఆకుకూరలను పెద్దగా తరిగి వండటం వల్ల, అందులో ఉండే పోషక విలువలు తగ్గకుండా మన శరీరానికి అందుతాయి.
☛ క్యారెట్, ముల్లంగి వంటి వాటిని దుంపలతో పాటు వాటికి ఉండే ఆకులను కూడా వండుకొని తినాలి. ఇలా చేస్తే వాటిలో ఉండే పోషకాలు శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
News January 2, 2026
Grok వ్యక్తి ప్రాణాలు కాపాడింది: మస్క్

నార్వేకు చెందిన 49 ఏళ్ల వ్యక్తి ప్రాణాలను X చాట్బోట్ Grok కాపాడింది. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న అతడికి వైద్యులు సాధారణ గ్యాస్ సమస్యగా భావించి మందులిచ్చారు. అయినా తగ్గకపోవడంతో తన సమస్యను గ్రోక్కు వివరించగా అది అపెండిక్స్ లేదా అల్సర్ కావచ్చని CT స్కాన్ చేయించుకోవాలని సూచించింది. టెస్టులో అపెండిక్స్ పగిలే దశలో ఉన్నట్లు తేలడంతో వైద్యులు సర్జరీ చేసి కాపాడారు. ఈ విషయాన్ని మస్క్ వెల్లడించారు.


