News March 12, 2025
పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు

AP: రాష్ట్రంలో ఈ నెల 17 నుంచి 31 వరకు జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నారు. 3,450 సెంటర్లలో 6,19,275 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారు. 156 ఫ్లైయింగ్, 682 సిట్టింగ్ స్క్వాడ్స్ పర్యవేక్షిస్తారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ విధిస్తారు. జిరాక్స్, నెట్ సెంటర్లను మూసివేస్తారు. హాల్లోకి చీఫ్ సూపరింటెండెంట్ తప్ప ఎవరూ మొబైల్ తీసుకెళ్లకూడదు. కంట్రోల్ రూమ్ నం. 08662974540.
Similar News
News December 29, 2025
RSS అల్ఖైదా లాంటిది: మాణికం ఠాగూర్

RSSను ఉగ్ర సంస్థ అల్ఖైదాతో పోలుస్తూ కాంగ్రెస్ MP మాణికం ఠాగూర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘RSS విద్వేషాన్ని వ్యాప్తి చేసే సంస్థ. అల్ఖైదా లాంటిది. దాని నుంచి <<18686086>>నేర్చుకోవడానికి<<>> ఏమీ లేదు. 140 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ ప్రజలను ఏకతాటిపైకి తెచ్చింది. ప్రజా ఉద్యమంగా పార్టీని గాంధీ మార్చారు. అలాంటి పార్టీ ఈ సంస్థ నుంచి నేర్చుకోవాలా?’ అని ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్ హద్దు దాటుతోందని BJP మండిపడింది.
News December 29, 2025
డెలివరీ తర్వాత ఈ సమస్య వస్తోందా?

కొంతమందిలో డెలివరీ తర్వాత నవ్వినా, తుమ్మినా, దగ్గినా, ఇతర ఒత్తిడికరమైన పనులు చేసినా మూత్రాశయం నియంత్రణ కోల్పోతుంది. దీంతో మూత్రం లీక్ అవుతుంది. హార్మోన్లు, టిష్యూల లాక్సిటీ వలన ఇలా జరుగుతుంది. బ్లాడర్ గోడకు సపోర్ట్గా ఉండే ఈ టిష్యూలు డెలివరీ టైంలో దెబ్బతింటాయి. సాధారణంగా కొంత కాలానికి సమస్య తగ్గుతుంది. తగ్గకపోతే ఇంట్లోనే కెగెల్ వ్యాయామాలు చెయ్యాలి. అప్పటికీ సమస్య ఉంటే వైద్యులను సంప్రదించాలి.
News December 29, 2025
భారత్ తరఫున ఆడిన కబడ్డీ ప్లేయర్పై పాక్ నిషేధం

భారత్ తరఫున ఆడిన కబడ్డీ ప్లేయర్ ఉబైదుల్లా రాజ్పుత్పై పాకిస్థాన్ చర్యలు తీసుకుంది. ఈ విషయంపై అత్యవసరంగా సమావేశమైన పాక్ కబడ్డీ సమాఖ్య అతడిపై నిరవధికంగా నిషేధం విధించింది. తమ నుంచి NOC లెటర్ తీసుకోలేదని, ఎవరి అనుమతీ అడగకుండా టోర్నమెంట్లో పాల్గొన్నాడని చెప్పింది. కాగా బహ్రెయిన్లో జరిగిన ఓ <<18606414>>టోర్నీలో<<>> ఇండియన్ జెర్సీ, జెండాతో ఉబైదుల్లా కనిపించడం వివాదాస్పదమైంది.


