News April 24, 2024

టెన్త్.. రాష్ట్ర చరిత్రలో అత్యధిక మార్కులు

image

AP: నిన్న టెన్త్ ఫలితాల్లో 600కు 599 మార్కులు సాధించిన ఏలూరు జిల్లా విద్యార్థిని మనస్వి చరిత్ర సృష్టించారు. రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఇవే అత్యధిక మార్కులు. 2022లో 598, 2023లో 597 మార్కులు రాగా.. ఇప్పుడు ఆ రికార్డులను మనస్వి బద్దలుకొట్టారు. మనస్వి తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులే. వారి గైడెన్స్ తనకెంతో ఉపయోగపడిందని, ఐఐటీలో కంప్యూటర్ కోర్స్ చేస్తానని చెబుతున్నారు ఈ సరస్వతీ పుత్రిక.

Similar News

News December 16, 2025

ఆరోగ్య భద్రతకు డిజిటల్ హెల్త్ రికార్డులు: CBN

image

AP: ప్రజల ఆరోగ్య భద్రతకు సంజీవని ప్రాజెక్టు కింద డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందిస్తున్నట్లు CM CBN తెలిపారు. రియల్ టైమ్‌లోనే ఆరోగ్య వివరాలు తెలుసుకునేలా సంజీవని ద్వారా ఇంటిగ్రేట్ చేస్తున్నామన్నారు. ‘రోగాలను ముందుగా నిరోధించే ప్రివెంటివ్ టెక్నాలజీస్‌పై దృష్టి పెట్టాలి. యోగా, నేచురోపతిని ప్రోత్సహించాలి. డిజిటల్ ఏఐ ఎనేబుల్డ్ హెల్త్, హెల్త్ ఫైనాన్సింగ్ రిఫార్మ్స్‌పై దృష్టి పెట్టాలి’ అని సూచించారు.

News December 16, 2025

34ఏళ్లకే బిలియనీర్ అయిన మీషో CEO

image

ప్రముఖ E-కామర్స్ ప్లాట్‌ఫాం Meesho కో-ఫౌండర్, CEO విదిత్ ఆత్రే 34ఏళ్లకే బిలియనీర్‌గా మారారు. ఇటీవల స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన మీషో షేర్లు ఇష్యూ ధర రూ.111 నుంచి రూ.193కు ఎగబాకడంతో ఆయన నెట్‌వర్త్ 1B డాలర్లను దాటింది. కంపెనీలో 11.1 శాతం వాటా కలిగిన ఆత్రే షేర్ల విలువ ప్రస్తుతం సుమారు రూ.9,128 కోట్లుగా ఉంది. మరో కో-ఫౌండర్ సంజీవ్ బర్న్‌వాల్ సంపద కూడా భారీగా పెరిగి రూ.6,099 కోట్లకు చేరుకుంది.

News December 16, 2025

డైరెక్టర్ సుజీత్‌కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన పవర్‌స్టార్

image

‘OG’ సినిమాతో భారీ విజయాన్ని అందించిన డైరెక్టర్ సుజీత్‌కు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అదిరిపోయే కానుక ఇచ్చారు. దాదాపు రూ. 2 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును బహుమతిగా అందించారు. దీనిపై సుజీత్ స్పందిస్తూ.. ‘చిన్నప్పటి నుంచి అభిమానిగా ఉన్న నాకు నా ‘OG’ నుంచి లభించిన ఈ ప్రేమ, ప్రోత్సాహం వెలకట్టలేనిది. ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటా’ అని Xలో ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు పంచుకున్నారు.