News March 25, 2025
టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్.. 9 మందిపై కేసు

AP: కడప(D) వల్లూరులో నిన్న మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ లీకైన ఘటనలో పోలీసులు 9 మందిపై కేసు నమోదు చేశారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్ సహా 9 మందిపై కేసు నమోదైంది. ఈ విషయంలో ఇప్పటికే పలువురిని సస్పెండ్ చేసినట్లు డీఈవో షంషుద్దీన్ వెల్లడించారు. వాటర్ బాయ్ సాయి మహేశ్ ఫొటో తీసి వివేకానంద స్కూల్లో పనిచేస్తున్న విఘ్నేశ్వర్కి వాట్సాప్ చేసినట్లు ఆయన వివరించిన విషయం తెలిసిందే.
Similar News
News March 26, 2025
టెన్త్ ఎగ్జామ్ సరిగా రాయలేదని..

TG: పది పరీక్ష సరిగా రాయలేదని తనువు చాలించిందో విద్యార్థిని. నల్గొండ(D) కట్టంగూర్కు చెందిన పూజిత భార్గవి(15) ప్రస్తుతం జరుగుతున్న టెన్త్ పరీక్షలకు హాజరవుతోంది. సోమవారం జరిగిన ఇంగ్లిష్ ఎగ్జామ్ సరిగా రాయలేదని మనస్తాపానికి గురైంది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
* జీవితంలో ఎగ్జామ్ ఓ భాగం మాత్రమే. పరీక్షల్లో ఫెయిలైనా లైఫ్లో ఎంతో ఎత్తుకు ఎదిగిన వారెందరో ఉన్నారు.
News March 26, 2025
సూసైడ్ చేసుకుంటానని భర్తను బెదిరించడం క్రూరత్వమే: హైకోర్టు

సూసైడ్ చేసుకుంటానంటూ భర్తను, అతడి కుటుంబాన్ని భార్య బెదిరించడం క్రూరత్వం కిందికే వస్తుందని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. భార్య అలా చేస్తే భర్త విడాకులు తీసుకోవడంలో తప్పేం లేదని తేల్చిచెప్పింది. భార్య సూసైడ్ పేరిట తమ కుటుంబాన్ని వేధిస్తోందని ఆరోపిస్తూ ఓ భర్త దిగువ కోర్టులో విడాకులకు అప్లై చేశారు. కోర్టు మంజూరు చేయగా భార్య హైకోర్టుకెళ్లారు. ఆ కేసు విచారణలో ధర్మాసనం తాజా వ్యాఖ్యలు చేసింది.
News March 26, 2025
రష్యా, ఉక్రెయిన్ మధ్య కీలక ఒప్పందం

రష్యా, ఉక్రెయిన్ కీలక ఒప్పందానికి వచ్చాయి. చమురు కర్మాగారాలు, రిఫైనరీలు, విద్యుత్ ప్లాంట్లు తదితర ఇంధన ఉత్పత్తి ప్రాంతాలపై దాడి చేసుకోరాదని అంగీకరించాయి. ఓ ప్రకటనలో రష్యా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇది 30 రోజుల కోసం చేసుకున్న తాత్కాలిక ఒప్పందమేనని, పరస్పర అంగీకారంతో మరింత పొడిగించేందుకు అవకాశం ఉందని పేర్కొంది. రెండు దేశాల్లో ఎవరు ఈ అంగీకారాన్ని ఉల్లంఘించినా ఒప్పందం రద్దవుతుందని వివరించింది.