News April 22, 2024
టెన్త్ ఫలితాలు ఆలస్యం!
AP: పదోతరగతి ఫలితాలు ఆలస్యంగా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఉ.11 గంటలకు ఫలితాలు రావాల్సి ఉంది. అయితే ఉ.11.30 గంటలకు రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. దీంతో ఫలితాలు అరగంట ఆలస్యం కానున్నాయి. ఈసారి 6.03 లక్షల మంది టెన్త్ ఎగ్జామ్స్ రాశారు.
Similar News
News October 15, 2024
‘ఆమడ దూరం’ వెళ్లొస్తా.. అంటే ఎంత దూరం?
పూర్వీకులు ఆమడ దూరం అనే పదాన్ని ఎక్కువగా వాడేవారు. ఏదైనా ప్రాంతం ఎంత దూరంలో ఉందో చెప్పేందుకు ఈ పదాన్ని ఉపయోగిస్తారు. అయితే, ఇలా చెప్పేవారికీ అది ఎంతదూరమో తెలియదనేది వాస్తవం. ఆంగ్లేయులు రాకముందు భారతీయులు కొలతల్లో ‘ఆమడ’ను వినియోగించేవారు. దీన్నే యోజనం అని కూడా పిలుస్తారు. అతి చిన్న కొలత అంగుళమైతే.. అతిపెద్దది ‘ఆమడ’. 8 మైళ్ల దూరాన్ని ఆమడ అంటారు. అంటే దాదాపు 13 కిలోమీటర్లని పెద్దలు చెప్తుంటారు.
News October 15, 2024
84 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధం
సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవసీ పాలసీని ఉల్లంఘించిన 84.58 లక్షల ఖాతాలను వాట్సాప్ బ్యాన్ చేసింది. ఒక్క ఆగస్టులోనే ఈ సంఖ్యలో నిషేధం విధించినట్లు పేర్కొంది. వీటిలో అనుమానాస్పదంగా ఉన్న 16.61 లక్షల అకౌంట్లను ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా ముందుగానే గుర్తించి జాగ్రత్త చర్యగా బ్యాన్ చేసినట్లు తెలిపింది. కాగా ఆగస్టులో వాట్సాప్ గ్రీవెన్స్కు 10,707 ఫిర్యాదులు అందినట్లు వెల్లడించింది.
News October 15, 2024
‘దేవర’ విజయం: లేఖ రాసిన ఎన్టీఆర్
దేవర సినిమా విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ ఈరోజు ఓ లేఖ విడుదల చేశారు. ‘దేవర సినిమాకు నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మీరు అందిస్తున్న ఆదరణకు థాంక్స్. నా సహనటులు, టెక్నీషియన్స్, నిర్మాతలు అందరికీ ధన్యవాదాలు. నెల రోజులుగా దేవరను ఓ పండుగలా జరుపుకొంటున్న నా ఫ్యాన్స్కు శిరసు వంచి కృతజ్ఞతలు చెబుతున్నాను. ఎప్పటికీ మీరు గర్వపడే సినిమాలే చేయడానికి ప్రయత్నిస్తాను’ అని పేర్కొన్నారు.