News December 2, 2024
పాక్లో ‘టెర్రర్’.. నవంబర్లో 245 మంది మృతి

ఆత్మాహుతి, ఉగ్రదాడులతో పాకిస్థాన్ విలవిల్లాడుతోంది. NOVలో జరిగిన 71 దాడుల్లో 245మంది మృత్యువాతపడ్డారు. ఈ సంఖ్య ఈ ఏడాదిలో రెండో అత్యధికం. వీరిలో 127మంది టెర్రరిస్టులు, 68మంది భద్రతా సిబ్బంది, 50మంది పౌరులు ఉన్నారని PICSS వెల్లడించింది. మరో 257మంది గాయపడ్డారని తెలిపింది. ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్థాన్లోనే ఎక్కువగా పేలుడులు సంభవించినట్లు పేర్కొంది. AUGలో అత్యధికంగా 254మంది మరణించినట్లు తెలిపింది.
Similar News
News October 16, 2025
పోరాటం ఆపినప్పుడే నిజంగా ఓడినట్లు: విరాట్ కోహ్లీ

కోహ్లీ WC2027 వరకూ కొనసాగుతారా? లేక ఆలోపే రిటైర్ అవుతారా? అని చర్చ జరుగుతున్న వేళ రన్ మెషీన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘పోరాటం ఆపాలని ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో అప్పుడే మనం ఓడిపోయినట్టు’ అని పేర్కొన్నారు. దీంతో WC వరకు తాను కొనసాగుతానని, గివప్ చేసే ప్రశ్నే లేదని ఆయన స్పష్టం చేశారని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ నెల 19నుంచి జరగనున్న AUS సిరీస్ కోసం కోహ్లీ ఆ దేశానికి వెళ్లిన విషయం తెలిసిందే.
News October 16, 2025
తాజా సినీ ముచ్చట్లు!

* రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ‘పెద్ది’ మూవీ నుంచి త్వరలో ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. ఇప్పటికే షూట్ పూర్తయింది
* ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈనెల 23న ‘ఫౌజీ’ సినిమా నుంచి అప్డేట్స్ రానున్నాయి.
* మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చి ఫుట్పాల్ పెరిగిందని, కానీ నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ వ్యాఖ్యలు ఎంతో కష్టపడి తీసిన చిత్రాన్ని ఇబ్బందిపెట్టాయని ‘అరి’ డైరెక్టర్ జయశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు
News October 16, 2025
రబీలో కుసుమ సాగుకు అనువైన రకాలు

రబీలో సాగుకు అనువైన నూనెగింజ పంటల్లో కుసుమ ఒకటి. ఇది ఔషధ మొక్కగా, నూనెగింజ పంటగా విశిష్ఠ ప్రాధాన్యత కలిగి ఉంది. చల్లని వాతావరణంలో ఇది అధిక దిగుబడినిస్తుంది. అక్టోబరు చివరి వరకు ఈ పంటను నాటుకోవచ్చు. టి.ఎస్.ఎఫ్-1, నారీ-6, నారీ ఎన్.హెచ్-1, పి.బి.ఎన్.ఎస్-12, D.S.H-185, ఎస్.ఎస్.ఎఫ్-708 వంటి రకాలు అధిక దిగుబడిని అందిస్తాయి. నారీ-6 రకం ముళ్లు లేనిది. ఎకరాకు 7.5kgల నుంచి 10kgల విత్తనం సరిపోతుంది.