News October 24, 2024
ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి.. ఐదుగురు సైనికులకు గాయాలు
కశ్మీర్లో ఉగ్రమూకలు మరో దాడికి తెగబడ్డాయి. ఉత్తర కశ్మీర్లోని గుల్మార్గ్ బోటాపతేర్ ప్రాంతంలో సైనికుల వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు సైనికులు గాయపడినట్టు తెలుస్తోంది. గందర్బాల్లో ఓ కార్మికుడిపై కాల్పులు జరిగిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 24, 2024
‘పింక్ ఆటోలు’.. ఆలోచన బాగుంది కదా!
మహిళల భద్రత, స్వయం ఉపాధి కోసం తమిళనాడు ప్రభుత్వం ‘పింక్ ఆటోరిక్షాల’ స్కీం తీసుకొచ్చింది. CNG లేదా హైబ్రిడ్ ఆటోలు కొనుగోలు చేసేందుకు 250 మంది ఒంటరి, నిరుపేద మహిళలకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తుంది. మిగతా మొత్తం తక్కువ వడ్డీకి లోన్ రూపంలో అందిస్తుంది. అందులో జీపీఎస్ ఉండటం వల్ల డ్రైవర్లకు, ప్రయాణికులకు భద్రత ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పథకం తీసుకొస్తే బాగుంటుంది కదూ..!
News October 24, 2024
‘పుష్ప-2’కు బన్నీకి రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లంటే?
పుష్ప-2 కు అల్లు అర్జున్ భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రూ.100 కోట్లు తీసుకున్నారని కొన్ని కథనాలు పేర్కొన్నాయి. అయితే మూడేళ్ల కాలాన్ని ఈ సినిమాకే వెచ్చించడంతో రూ.200 కోట్లకుపైగా తీసుకుంటారని మరికొన్ని తెలిపాయి. లేదంటే సినిమా కలెక్షన్లలో 27శాతం ప్రాఫిట్ తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారని సమాచారం. కాగా ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది.
News October 24, 2024
Meta, X సహకారం కోరిన కేంద్ర ప్రభుత్వం
విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు అధికమవ్వడంతో వీటి కట్టడిలో సహకరించాలని X, Meta సంస్థలను కేంద్రం కోరింది. ఈ వేదికల మీద వస్తున్న బెదిరింపు కాల్స్, సందేశాల వెనుక ఉన్నవారిని గుర్తించేందుకు అవసరమైన డేటాను తమతో పంచుకోవాలని కోరింది. దేశ ప్రజల శ్రేయస్సుతో ముడిపడిన అంశం కారణంగా 2 సంస్థలు సహకరించాల్సి ఉందని ఓ అధికారి తెలిపారు. 9 రోజుల్లో 170 విమానాలకు బెదిరింపులు వచ్చాయి.