News August 26, 2024

ఉగ్రవాదుల కాల్పులు.. 22 మంది మృతి

image

పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పంజాబ్‌ను బలూచిస్థాన్‌తో కలిపే హైవేపై వారు బస్సులు, ట్రక్కులు, వ్యాన్‌లను నిలుపుతూ అందులోని వారిని తనిఖీ చేస్తూ కాల్పులు జరిపారు. ఈ దాడుల్లో 22 మంది మృతి చెందగా ఐదుగురికి గాయాలైనట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. చనిపోయిన వారిలో 19 మంది పంజాబీలు, ముగ్గురు బలూచీలు ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. మొత్తం 10 వాహనాలకు ఉగ్రమూకలు నిప్పు పెట్టాయి.

Similar News

News January 1, 2026

నావల్ డాక్‌యార్డ్‌లో 320 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో 320 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్, ITI అర్హతగల వారు NAPS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్(DV) ద్వారా ఎంపిక చేస్తారు. MARCH 22న రాత పరీక్ష నిర్వహించి, 25న ఫలితాలు వెల్లడిస్తారు. DV మార్చి 30న, మెడికల్ టెస్ట్ మార్చి 31 న నిర్వహిస్తారు. https://indiannavy.gov.in

News January 1, 2026

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది 1.2 కోట్ల కొలువులు!

image

2026లో ఉద్యోగ నియామకాల జోరు మరింత పెరగనున్నట్లు టీమ్‌లీజ్ అంచనా వేసింది. ఈ ఏడాది సుమారు 1.2 కోట్ల కొత్త కొలువులు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. టాటా మోటార్స్, EY, గోద్రేజ్ వంటి దిగ్గజ సంస్థలు క్యాంపస్ హైరింగ్‌తో పాటు టెక్నాలజీ, AI రంగాల్లో భారీగా రిక్రూట్‌మెంట్ చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు, విభిన్న ప్రతిభావంతులకు ప్రాధాన్యం ఇస్తూ వైవిధ్యతను పెంచడంపై కంపెనీలు ఫోకస్ పెట్టడం విశేషం.

News January 1, 2026

ప్రసాదంపై తప్పుడు వీడియో… భక్తులపై కేసు

image

AP: ప్రసాదంలో నత్తగుల్ల వచ్చిందని వీడియో పెట్టిన ఇద్దరు భక్తులపై సింహాచలం ఆలయ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. DEC 29న ఆ భక్తులు ప్రసాదాన్ని బయటకు తీసుకెళ్లి తిరిగి తెచ్చారని, ఆ సమయంలో వారు కల్తీ చేసి ఉంటారని పేర్కొన్నారు. ‘ఆరోజు 15వేల పులిహోర పొట్లాలు అమ్మాం. ఇలాంటి ఫిర్యాదు గతంలోనూ ఎవరినుంచీ రాలేదు. ప్రసాదం తయారీలో నిపుణులైన వంటవారు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు’ అని పేర్కొన్నారు.