News September 20, 2025

ఉగ్ర కలకలం.. రాంచీలో ISIS రిక్రూట్‌మెంట్ శిబిరం

image

ఝార్ఖండ్‌లోని రాంచీలో ISIS ఉగ్రవాద రిక్రూట్‌మెంట్ శిబిరం బట్టబయలైంది. కొన్నిరోజుల కిందట ఈ నగరంలో అనుమానిత ఉగ్రవాది అష్రఫ్ డానిష్‌‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి విచారణలో ఉగ్ర శిబిరం గురించి తెలియడంతో రైడ్ చేశారు. అక్కడ పెద్దఎత్తున బాంబు తయారీ పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు.

Similar News

News September 20, 2025

ట్రంప్ నిర్ణయంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం: శ్రీధర్ బాబు

image

TG: H1B వీసా ఛార్జీలను పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రానికి తీవ్ర నష్టమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ‘మన రాష్ట్రం నుంచి అమెరికాకు చాలామంది వెళ్లారు. ఇక్కడ కుటుంబాలు వాళ్లు పంపించే మనీ పైనే ఆధారపడుతున్నాయి. TCSలో లక్ష మంది, విప్రోలో 80 వేలు, ఇన్ఫోసిస్‌లో 60 వేల మంది USలో పనిచేస్తున్నారు. ట్రంప్ నిర్ణయంపై PM మోదీ మౌనం వెనుక ఉన్న ఆంతర్యమేంటి. USతో కేంద్రం చర్చలు జరపాలి’ అని కోరారు.

News September 20, 2025

గవర్నర్, రేవంత్, కేసీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు

image

TG: రేపటి నుంచి బతుకమ్మ పండగ ప్రారంభం నేపథ్యంలో గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం KCR తెలంగాణ ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే పండగ బతుకమ్మ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కష్టాల నుంచి రక్షించి రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రకృతి మాత బతుకమ్మను ప్రార్థిస్తున్నట్లు KCR తెలిపారు.

News September 20, 2025

H1B వీసా: 2 గంటల్లోనే భారీగా పెరిగిన టికెట్ ధర

image

H1B వీసాదారులు రేపటిలోగా USలో ఉండాలన్న <<17769573>>నిబంధనను<<>> విమానయాన సంస్థలు భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి. ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లేందుకు ఇప్పటివరకు టికెట్ ధర రూ.34-37వేలు ఉండగా దాన్ని రూ.70-80వేలకు పెంచాయి. ట్రంప్ ప్రకటన వెలువడిన 2 గంటల్లోనే ధరలు భారీగా పెంచడం గమనార్హం. దుర్గాపూజ కోసం చాలామంది వీసాదారులు US నుంచి INDకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వారంతా ఉరుకులు పరుగుల మీద USకు బయల్దేరుతున్నారు.