News April 4, 2024

త్వరలో ఇండియాలో టెస్లా కార్ల తయారీ ప్లాంట్!

image

బిలియనీర్ ఎలాన్ మస్క్ ఎట్టకేలకు భారతీయ ఈవీ కార్ల తయారీ మార్కెట్‌లోకి అడుగుపెట్టనున్నారు. టెస్లా మోటార్స్ తన ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఇండియాలో అనువైన ప్రాంతాన్ని గుర్తించే పనిలో పడింది. ఈక్రమంలో ఈనెలలోనే అమెరికా నుంచి టెస్లా బృందం ఇండియాకు రానుంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడులో ఏర్పాటైన ఆటోమోటివ్ హబ్‌లతో ఈ బృందం ప్లాంట్ కోసం స్థలాన్ని గుర్తించనుంది.

Similar News

News April 10, 2026

యుద్ధం.. శాంతి చర్చలకు పాక్ బయల్దేరిన జేడీ వాన్స్

image

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్‌తో శాంతి చర్చల్లో పాల్గొనేందుకు కాసేపటి క్రితమే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాకిస్థాన్‌కు బయల్దేరారు. ఇస్లామాబాద్‌లోని సెరెనా హోటల్‌లో అమెరికా-ఇరాన్ ప్రతినిధులు భేటీ కానున్నారు. చర్చల ఫలితాలపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. చర్చల నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో 2 రోజులు లాక్‌డౌన్ విధించారు.

News April 10, 2026

ఇండక్షన్ స్టవ్స్‌కు డిమాండ్.. కేంద్రం చర్యలు!

image

గ్యాస్ కొరత కారణంగా దేశంలో ఇండక్షన్ స్టవ్స్ వాడకం పెరుగుతోంది. రాబోయే రోజుల్లో 40% డిమాండ్ పెరగొచ్చని, అందుకు అదనంగా 27GW విద్యుత్ అవసరం పడుతుందని భావిస్తోంది. దీంతో డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచాలని ఇండక్షన్ స్టవ్ కంపెనీలతో చర్చిస్తోంది. అలాగే విద్యుదుత్పత్తి విషయంలోనూ చర్యలకు సిద్ధమవుతోంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా దేశంలో LPG కొరత ఏర్పడటంతో ప్రజలు భారీగా ఇండక్షన్ స్టవ్‌లు కొంటున్నారు.

News April 10, 2026

భారీగా పెరగనున్న భూముల మార్కెట్ విలువ!

image

TG: త్వరలో భూముల మార్కెట్ విలువ భారీగా పెరగనుంది. 20% పెంచాలని రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ తాజాగా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనిపై క్యాబినెట్‌లో చర్చించి సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. ఆదాయ మార్గాలను పెంచేందుకు ఈ దిశగా అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. ఇక HMDA ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల విక్రయానికి సంబంధించి ప్రపంచ స్థాయిలో ప్రచారం నిర్వహించాలని భావిస్తోంది.