News October 18, 2024

భారత్‌తో టెస్టు.. కివీస్ 402 పరుగులకు ఆలౌట్

image

INDతో తొలిటెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 402 పరుగులకు ఆలౌటైంది. దీంతో 356 పరుగుల ఆధిక్యత సాధించింది. రచిన్ రవీంద్ర 134, కాన్వే 91, టిమ్ సౌథీ 65, విల్ యంగ్ 33 పరుగులు చేశారు. రవీంద్ర జడేజా, కుల్దీప్ చెరో 3 వికెట్లు, సిరాజ్ 2, అశ్విన్, బుమ్రా తలో వికెట్ తీశారు. టీమ్ ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 46 స్కోరుకే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఇంకా రెండు రోజుల ఆట మిగిలిఉండటంతో భారత్ చెమటోడ్చాల్సి ఉంది.

Similar News

News November 21, 2025

అరటి రైతుల ఆక్రందనలు పట్టట్లేదా: షర్మిల

image

AP: అరటి రైతుల ఆక్రందనలు కూటమి ప్రభుత్వానికి పట్టకపోవడం సిగ్గుచేటు అని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల మండిపడ్డారు. అరటి టన్ను ధర రూ.28వేల నుంచి రూ.వెయ్యికి పడిపోయిందన్నారు. కిలో రూపాయికి అమ్ముకోలేక కష్టపడి పండించిన అరటిని పశువులకు మేతగా వేస్తుంటే రైతు సంక్షేమం ఎక్కడుంది? అని ఫైరయ్యారు. ప్రభుత్వం తక్షణమే రైతుల బాధలను వినాలని, టన్నుకు రూ.25వేలు గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు.

News November 21, 2025

రెండో టెస్టుకు గిల్ దూరం.. ముంబైకి పయనం

image

మెడనొప్పితో బాధపడుతున్న టీమ్ఇండియా టెస్ట్ కెప్టెన్ గిల్ సౌతాఫ్రికాతో జరగాల్సిన రెండో టెస్టుకు దూరమయ్యారు. ICUలో చికిత్స పొంది జట్టుతో పాటు గువాహటికి చేరుకున్న ఆయనకు ఇవాళ ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించారు. అందులో ఫెయిల్ కావడంతో జట్టు నుంచి రిలీజ్ చేశారు. కొద్దిసేపటి కిందటే గిల్ ముంబైకి పయనమయ్యారు. అక్కడ వైద్య నిపుణుల పర్యవేక్షణలో 3 రోజులు చికిత్స తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

News November 21, 2025

వంటగది చిట్కాలు

image

* చపాతీ పిండిలో టేబుల్ స్పూన్ పాలు, బియ్యప్పిండి, నూనె వేసి ఐస్ వాటర్‌తో కలిపితే చపాతీలు మెత్తగా వస్తాయి.
* పల్లీలు వేయించేటప్పుడు 2 స్పూన్ల నీరు పోసివేయిస్తే తొందరగా వేగడంతో పాటు పొట్టు కూడా సులువుగా పోతుంది.
* కొత్త చీపురుని దువ్వెనతో శుభ్రం చేస్తే అందులో ఉండే దుమ్ము పోతుంది.
* వెల్లుల్లికి వైట్ వెనిగర్ రాస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
* పాలను కాచిన తర్వాత ఎండ, వేడి పడని చోట పెట్టాలి.