News September 21, 2024

విమర్శలను సహించడమే ప్రజాస్వామ్యానికి పరీక్ష: గడ్కరీ

image

వ్యతిరేక అభిప్రాయాలను సహిస్తూ, అవి పాలకుడిలో అంతర్మథనానికి దారితీయడమే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద పరీక్షని మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రచయితలు, మేధావులు నిర్భయంగా అభిప్రాయాలు చెప్పాలన్నారు. ‘దేశంలో భిన్నాభిప్రాయాలపై ఇబ్బంది లేదు. అభిప్రాయాలు లేకపోవడమే అసలు సమస్య. మేం రైటిస్టులమో లెఫ్టిస్టులమో కాదు. మేం ఆపర్చునిస్టులం. అంటరానితనం, ఆధిపత్యం, చిన్నతనం ఉన్నన్నాళ్లూ జాతి నిర్మాణం జరగద’ని అన్నారు.

Similar News

News September 21, 2024

జానీ మాస్టర్‌ను కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్!

image

లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన జానీ మాస్టర్‌పై పోలీసులు కస్టడీ పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు ఉప్పరపల్లి కోర్టును కోరనున్నారు. మరోవైపు జానీపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు కావడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ కోసం అతడి తరఫు న్యాయవాది పిటిషన్ వేయనున్నారు.

News September 21, 2024

ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ పూర్తి

image

AP: ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ విజయవంతమైంది. ఇప్పటికే రెండు బోట్లను తొలగించిన అధికారులు తాజాగా మూడో పడవను బయటికి తీశారు. వీటిని పున్నమి ఘాట్‌కు తరలించారు. ఈ ప్రక్రియకు 15 రోజులు శ్రమించాల్సి వచ్చింది. ఈనెల 1న భారీ ప్రవాహానికి 5 పడవలు బ్యారేజీని ఢీకొట్టాయి. వాటిలో ఒకటి దిగువకు కొట్టుకుపోగా, మిగతావి గేట్ల వద్ద చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.

News September 21, 2024

పీఏసీ సమావేశం నుంచి BRS ఎమ్మెల్యేలు వాకౌట్

image

TG: పీఏసీ సమావేశం నుంచి BRS ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అధ్యక్షతన పీఏసీ సమావేశం ప్రారంభం కాగా, ఛైర్మన్ ఎన్నిక చెల్లదని BRS ఎమ్మెల్యేలు చెప్పారు. ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి, రమణ వాకౌట్ చేసి వెళ్లిపోయారు.