News April 15, 2025
నేటి నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ

TG: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టీజీ టెట్) దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఒక పేపర్కు రూ.750, రెండు పేపర్లకు రూ.1000గా ఫీజు నిర్ణయించారు. అభ్యర్థులకు ఏమైనా ఇబ్బందులు వస్తే హెల్ప్డెస్క్(7093958881, 7093468882) ఈ నెల 15 నుంచి జులై 22 వరకు అందుబాటులో ఉంటుంది. టెట్ పరీక్షలు జూన్ 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో నిర్వహించనున్నారు.
Similar News
News April 16, 2025
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ ఛైర్పర్సన్గా జయసుధ

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్ జ్యూరీకి నటి జయసుధ ఛైర్పర్సన్గా వ్యవహరించనున్నారు. 15 మంది సభ్యులతో కూడిన ఈ జ్యూరీ తాజాగా FDCలో సమావేశమైంది. అవార్డుల ఎంపికలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని జ్యూరీ సభ్యులను TFDC ఛైర్మన్ దిల్ రాజు కోరారు. అన్ని విభాగాల్లో కలిపి 1,248 నామినేషన్స్ రాగా ఈ నెల 21 నుంచి జ్యూరీ సభ్యులు స్క్రీనింగ్ చేయనున్నారు. నిష్పక్షపాతంగా ప్రక్రియను హ్యాండిల్ చేస్తామని జయసుధ పేర్కొన్నారు.
News April 16, 2025
వైఎస్ జగన్కు టీడీపీ సవాల్

AP: టీటీడీ గోశాలలో గోవులు పెద్దఎత్తున మరణించాయనే ప్రచారంపై TDP ఘాటుగా స్పందించింది. వైసీపీ చీఫ్ జగన్, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి రేపు తిరుమలకు రావాలని Xలో ఛాలెంజ్ చేసింది. గోశాలలో గోమాతలు ఎలా ఉన్నాయో కళ్లారా చూడాలంది. రేపు ఉ.10 గంటలకు లైవ్ ఇస్తామని పేర్కొంది.
News April 16, 2025
NEET-PG నోటిఫికేషన్ విడుదల

వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయ స్థాయి అర్హత పరీక్ష NEET-PG <