News August 5, 2024

షెడ్యూల్ ప్రకారమే టెట్ పరీక్షలు: పాఠశాల విద్యాశాఖ

image

AP: టెట్ పరీక్షలు గతంలో నిర్ణయించినట్లుగానే అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఆగస్టు 3తో దరఖాస్తు గడువు ముగియగా మొత్తం 4,27,300 మంది అప్లై చేసుకున్నట్లు పేర్కొంది. డీఎస్సీ ద్వారా ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనుండగా, డీఎస్సీలో టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.

Similar News

News November 22, 2025

విజయవాడ ఆసుపత్రిలో అరుదైన చికిత్స

image

విజయవాడ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ ను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. ఏలూరుకు చెందిన యువకుడు తేజ వికాస్ మహిళ గొంతుతో మాట్లాడేవాడు. ఈఎన్టీ వైద్యులు డాక్టర్ రవి రోగిని పరీక్షించి ప్యూబర్ఫోనియా వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. దీని కోసం టైప్-3 థైరొప్లాస్టీ శస్త్రచికిత్స ఉత్తమ మార్గమని నిర్ధారించి ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం రోగికి మహిళ వాయిస్ పోయి, పురుషుడు గొంతుతో మాట వస్తోందన్నారు.

News November 22, 2025

విప్లవోద్యమాన్ని కాపాడుకుందాం: మావోయిస్ట్ పార్టీ

image

డిసెంబర్ 2 నుంచి 8 వరకు ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం (PLGA) 25వ వార్షికోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహించాలని CPI(మావోయిస్టు) సెంట్రల్ మిలిటరీ కమిషన్ పిలుపునిచ్చింది. కగార్ యుద్ధం నుంచి పార్టీని, PLGAని, ప్రజా సంఘాలను, విప్లవోద్యమాన్ని కాపాడుకుందామని కోరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రతరం చేద్దామని పేర్కొంది. 11 నెలల్లో 320 మంది కామ్రేడ్స్ అమరులయ్యారని తెలిపింది.

News November 22, 2025

పాపాల నుంచి విముక్తి కోసం..

image

తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే |
విష్ణోర్నామసహస్రం మే శృణు పాప భయాపహమ్ ||సమస్త లోకాలకు ఆధారభూతుడైన, ఏకైక ప్రభువైన విష్ణుమూర్తి వేయి నామాలను తప్పక ఆలకించాలని భీష్మాచార్యుల వారు ఉద్బోధించారు. ఈ పవిత్ర నామాలను శ్రద్ధతో వినడం వలన పాప కర్మలు, జన్మ,మృత్యు భయాలు తొలగిపోతాయని నమ్మకం. శాశ్వత శాంతిని, సకల శుభాలను పొందడానికి విష్ణు సహస్ర నామ పారాయణ సులభమైన మార్గమంటారు.<<-se>>#VISHNUSAHASRANAMAM<<>>