News May 19, 2024
రేపటి నుంచి టెట్ పరీక్షలు

TG: రేపటి నుంచి జరగనున్న టెట్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 80 కేంద్రాల్లో జూన్ 6 వరకు పరీక్షలు కొనసాగుతాయి. ప్రతిరోజు 2 సెషన్ల చొప్పున ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సా.4.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. టెట్ పేపర్-1కి 99,958 మంది, పేపర్-2కి 1,86,428 మంది దరఖాస్తు చేసుకున్నారు.
Similar News
News November 18, 2025
5 రోజుల్లో రూ.5వేలు తగ్గిన ధర.. కారణమేంటి?

బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల <<18318028>>పతనం కొనసాగుతోంది<<>>. 5 రోజుల్లోనే 10గ్రాముల పసిడి ధర దాదాపు రూ.5వేలు, కేజీ వెండి రేటు రూ.15వేల వరకు తగ్గింది. వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం లేదనే అంచనాలతో గోల్డ్కు డిమాండ్ తగ్గినట్లు నిపుణుల అంచనా. అలాగే US డాలర్ బలపడటమూ ఓ కారణమని చెబుతున్నారు. కాగా ఫెడ్ వడ్డీ రేట్లు గోల్డ్ ధరలను ప్రభావితం చేసే విషయం తెలిసిందే.
News November 18, 2025
5 రోజుల్లో రూ.5వేలు తగ్గిన ధర.. కారణమేంటి?

బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల <<18318028>>పతనం కొనసాగుతోంది<<>>. 5 రోజుల్లోనే 10గ్రాముల పసిడి ధర దాదాపు రూ.5వేలు, కేజీ వెండి రేటు రూ.15వేల వరకు తగ్గింది. వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం లేదనే అంచనాలతో గోల్డ్కు డిమాండ్ తగ్గినట్లు నిపుణుల అంచనా. అలాగే US డాలర్ బలపడటమూ ఓ కారణమని చెబుతున్నారు. కాగా ఫెడ్ వడ్డీ రేట్లు గోల్డ్ ధరలను ప్రభావితం చేసే విషయం తెలిసిందే.
News November 18, 2025
‘వారణాసి’లో నటించడం గొప్ప గౌరవం: ప్రియాంక

‘వారణాసి’లో హీరోయిన్గా నటిస్తున్న బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ‘తెలుగు & మలయాళ ఇండస్ట్రీలకు చెందిన దిగ్గజాలు మహేశ్, పృథ్వీరాజ్తో కలిసి రాజమౌళి మూవీలో పనిచేయడం గొప్ప గౌరవం. మా సినిమా విడుదలకు ఏడాది ముందే అంతర్జాతీయ మీడియాతో ప్రమోట్ చేస్తున్నాం. మూవీపై పెరిగిన అంచనాలు మాలో మరింత ఉత్సాహాన్ని పెంచాయి. దేవుడి దయతో మీ అంచనాలను అందుకుంటాం. జై శ్రీరామ్’ అని రాసుకొచ్చారు.


