News February 19, 2025

TG-EAPCET-25 నోటిఫికేషన్ రేపే విడుదల

image

జేఎన్టీయూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న TG-EAPCET 2025 పరీక్షకు సంబంధించి నోటిఫికేషన్ గురువారం విడుదల చేస్తున్నట్లు కన్వీనర్ డీన్ కుమార్ వెల్లడించారు. ఈనెల 25వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా https://eapcet.tgche.ac.in ద్వారా తమని సంప్రదించవచ్చని వెల్లడించారు.

Similar News

News November 15, 2025

అమ్రాబాద్: పులుల లెక్కింపునకు వాలంటీర్ల ఆసక్తి

image

కవ్వాల్, అమ్రాబాద్, వికారాబాద్ రిజర్వ్ ఫారెస్ట్‌లలో అటవీశాఖ చేపట్టిన పులుల లెక్కింపునకు వాలంటీర్ల నుంచి భారీ స్పందన వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,620 మంది స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అత్యధిక మంది వాలంటీర్లు ముఖ్యంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారని అటవీశాఖ అధికారులు తెలిపారు.

News November 15, 2025

విశాఖలో రెండో రోజు CII సమ్మిట్

image

విశాఖలో CII సమ్మిట్ నేటితో ముగియనుంది. నిన్న సుమారు 400 MOUలు జరగ్గా.. నేడు గూగుల్, శ్రీ సిటీ, రేమండ్, ఇండోసోల్ వంటి ప్రాజెక్టుల శంకుస్థాపనలు చేయనున్నారు. న్యూజిలాండ్, జపాన్, కెనడా, మెక్సికో ప్రతినిధులతో CM చంద్రబాబు భేటీ కానున్నారు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, సస్టైనబుల్ సిటీస్, ‘ఆంధ్ర టూరిజం విజన్’ సెషన్లు చేపట్టనున్నారు. మంత్రి లోకేశ్ అధ్యక్షతన ‘AI అండ్ ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్’పై ముఖ్య చర్చ జరగనుంది.

News November 15, 2025

రెండో రోజు CII సదస్సు ప్రారంభం

image

AP: విశాఖలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఐఐ సదస్సు రెండో రోజు ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలో జరుగుతున్న రేమండ్ ఫౌండేషన్ ప్రోగ్రామ్‌కు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఇవాళ దేశ విదేశాలకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ అవుతారు.