News July 22, 2024
రోడ్లపై గుంతల గుర్తింపునకు యాప్ తెచ్చే యోచనలో TG సర్కార్!

TG: రోడ్లపై గుంతలను గుర్తించడం, మరమ్మతులు చేపట్టడం కోసం ఓ యాప్ను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. గుంత ఉన్న ప్రదేశాన్ని ఫొటో తీసి యాప్లో అప్లోడ్ చేస్తే ప్రభుత్వం స్పందించి మరమ్మతులు చేపడుతుంది. ఒకవేళ పనులు ఆలస్యమైతే కారణాలను పొందుపరుస్తుంది. కర్ణాటకలో అమల్లో ఉన్న దీనిని తొలుత GHMCలో, తర్వాత మున్సిపాలిటీల్లో అమలు చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకునే ఛాన్సుంది.
Similar News
News December 1, 2025
భారీ జీతంతో NTPCలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<
News December 1, 2025
లైంగిక వేధింపులు.. హీరోయిన్ కజిన్ ఆత్మహత్య

లైంగిక వేధింపులను భరించలేక హీరోయిన్ ఆశికా రంగనాథ్ కజిన్ అచల(22) ఆత్మహత్య చేసుకున్నారు. ‘దూరపు బంధువు మయాంక్తో అచలకు స్నేహం ఏర్పడింది. డ్రగ్స్కు బానిసైన మయాంక్ ఆమెను ప్రేమిస్తున్నానని ఫిజికల్ రిలేషన్ కోసం ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతో దాడి చేసి, మానసికంగా వేధించాడు’ అని బంధువులు ఆరోపిస్తున్నారు. అచల Nov 22న బెంగళూరులో ఉరేసుకుందని, ఇప్పటికీ మయాంక్పై చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు.
News December 1, 2025
రబీ వరి.. సాగు విధానం, ఎకరాకు విత్తన మోతాదు

☛ నాట్లు వేసే పద్ధతిలో- 20 కేజీల విత్తనం
☛ పొడి విత్తనం వెదజల్లే పద్ధతిలో 25-30 కేజీల విత్తనం
☛ మండి కట్టిన విత్తనం వెదజల్లే పద్ధతిలో 12-15 కిలో విత్తనం
☛ గొర్రు విత్తే పద్ధతిలో 15-20 కిలోల విత్తనం
☛ యంత్రాలతో నాటే విధానంలో 12-15 కిలోల విత్తనం
☛ బెంగాల్ నాటు విధానంలో అయితే 10-12 కిలోల విత్తనం
☛ శ్రీ పద్ధతిలో వరి నాటితే 2 కిలోల విత్తనం ఎకరాకు సరిపోతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.


