News January 15, 2025
కృష్ణా జలాల్లో మెజారిటీ వాటా TGకే దక్కాలి: మంత్రి ఉత్తమ్

కృష్ణా జలాల విషయంలో TGకి అన్యాయం జరగొద్దని మంత్రి ఉత్తమ్ అన్నారు. రేపు కృష్ణానది జలవివాదంపై విచారణ ఉన్న నేపథ్యంలో ట్రిబ్యునల్కు నివేదించాల్సిన అంశాలపై ఢిల్లీలో సమీక్షించారు. ట్రిబ్యునల్ ముందు రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపిస్తామన్నారు. TGలో సాగు విస్తీర్ణం ఎక్కువని, మెజారిటీ వాటా రాష్ట్రానికే దక్కాలని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం ఒప్పుకున్న ప్రతిపాదనను తాము అంగీకరించడం లేదని స్పష్టం చేశారు.
Similar News
News January 7, 2026
SVU స్నాతకోత్సవం నోటిఫికేషన్ విడుదల

తిరుపతి SVU స్నాతకోత్సవానికి ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2018 నుంచి 2024 వరకు కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు 63 నుంచి 68వ స్నాతకోత్సవం నిర్వహించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఫిబ్రవరి 20వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు www.svuexams.com ద్వారా దరఖాస్తులను నిర్ణీత ఫీజుతో సమర్పించాలి. స్నాతకోత్సవం విద్యార్థుల ఎదురుచూపులని ఇటీవల Way2Newsలో వార్త వచ్చిన విషయం తెలిసిందే.
News January 7, 2026
గ్రామాల అభివృద్ధిలో కార్యదర్శుల పాత్ర కీలకం: కలెక్టర్

ఖమ్మం: గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో 65 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్–4 పంచాయతీ కార్యదర్శులుగా నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు. పారిశుద్ధ్యం, పచ్చదనం, పన్నుల వసూలు, ప్రజలకు మెరుగైన వసతుల కల్పనలో బాధ్యతగా పనిచేయాలని వారికి సూచించారు.
News January 7, 2026
గ్రామాల అభివృద్ధిలో కార్యదర్శుల పాత్ర కీలకం: కలెక్టర్

ఖమ్మం: గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో 65 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్–4 పంచాయతీ కార్యదర్శులుగా నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు. పారిశుద్ధ్యం, పచ్చదనం, పన్నుల వసూలు, ప్రజలకు మెరుగైన వసతుల కల్పనలో బాధ్యతగా పనిచేయాలని వారికి సూచించారు.


