News July 19, 2024

TGPSC ఛైర్మన్ మహేందర్ రెడ్డికి భట్టి ఫోన్

image

TGPSC ఛైర్మన్ మహేందర్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోన్ చేశారు. DECలో గ్రూప్-2 నిర్వహణపై పరిశీలించాలని కోరారు. అంతకుముందు సచివాలయంలో గ్రూప్-2 అభ్యర్థులతో చర్చించిన భట్టి.. పరీక్ష వాయిదాపై సానుకూలంగా స్పందించారు. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు ఉన్నాయి. త్వరలో వాయిదాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Similar News

News October 24, 2025

మార్కాపురంలోకి శ్రీశైలం?.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు

image

AP: ప్రతిపాదిత మార్కాపురం జిల్లాలో శ్రీశైలాన్ని కలిపేలా అధికారులు ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపినట్లు తెలుస్తోంది. నంద్యాల(D) కేంద్రానికి శ్రీశైలం దూరంగా ఉండటంతో స్థానికుల నుంచి వినతులు వచ్చినట్లు సమాచారం. మార్కాపురానికి శ్రీశైలం 80 కి.మీ. దూరంలో ఉండగా, నంద్యాల-శ్రీశైలం మధ్య 165 కి.మీ దూరం ఉంది. మరోవైపు అద్దంకిని బాపట్ల(D) నుంచి తిరిగి ప్రకాశం(D)లో విలీనం చేసే ప్రతిపాదనలూ ఉన్నట్లు సమాచారం.

News October 24, 2025

అయోడిన్ లోపంతో ఎన్నో సమస్యలు

image

అయోడిన్‌ మన జీవక్రియల్లో కీలకపాత్ర పోషిస్తుంది. థైరాయిడ్‌ గ్రంథి అయోడిన్‌ను గ్రహించి, దాన్ని థైరాయిడ్‌ హార్మోన్లుగా మారుస్తుంది. ఇది తగ్గితే శరీర ఉష్ణోగ్రత, చురుకుదనం, శ్వాస, గుండెవేగం, జీవక్రియ దెబ్బతింటాయి. అయోడిన్‌ లోపిస్తే గాయిటర్‌, రొమ్ముల్లో క్యాన్సర్‌ రహిత గడ్డలు ఏర్పడతాయి. చేపలు, సముద్ర ఆహారం, పాలు, గుడ్లు, సోయా ఉత్పత్తుల్లో అయోడిన్‌ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

News October 24, 2025

బస్సు ప్రమాదం: నువ్ చాలా పెద్ద తప్పు చేశావ్

image

డ్రైవర్‌నే దేవుడిగా భావించి ప్రతి ఒక్కరూ బస్సు ఎక్కుతారు. కానీ <<18087723>>vKaveri<<>> విషాదంలో మెయిన్ డ్రైవర్ తప్పులు చేశాడనే విమర్శలొస్తున్నాయి. బైక్‌ను ఢీకొట్టగానే బస్ ఆపితే మంటలు చెలరేగేవి కాదు. పైగా ఫైర్ సేఫ్టీతో కాక నీటితో మంటలు ఆర్పే యత్నం చేసి పరిస్థితి చేయి దాటిందని పారిపోయాడు. కనీసం ప్యాసింజర్స్ దిగేలా డోర్ తీయాల్సింది. ప్రమాదంతో హైడ్రాలిక్ కేబుల్స్ తెగి డోర్ తెరుచుకోక చాలామంది బయటకు రాలేక చనిపోయారు.