News April 11, 2025
TGPSC కీలక నిర్ణయం

టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్రభుత్వ ఉద్యోగాల సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:1నిష్పత్తిలో జరపనున్నట్లు వెల్లడించింది. అదనపు అభ్యర్థులను పిలవడం వల్ల నియామక ప్రక్రియ ఆలస్యమవుతుండటంతో పాటు పోటీదారులను ఆశకు గురిచేసినట్లు అవుతోందని కమిషన్ పేర్కొంది. కాగా ఇది వరకు మల్టీ జోనల్, జోనల్ పోస్టులకు 1:2, జిల్లా పోస్టులకు 1:3, దివ్యాంగుల కేటగిరీకి 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను పిలిచేవారు.
Similar News
News March 15, 2026
100 కుక్కలకు విషం పెట్టి చంపేశారు

TG: మంచిర్యాల జిల్లాలో 100 వీధికుక్కలకు విషం పెట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల 7-8 తేదీల్లో జన్నారం మం. కిష్టాపూర్లో ఈ ఘటన జరిగింది. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి కుక్కలను చంపేందుకు ఇద్దరిని నియమించుకున్నారు. వారు కుక్కలకు విషపూరిత ఇంజెక్షన్లు ఎక్కించారు. అవి చనిపోయాక కళేబరాలను ఓ నది ఒడ్డున పూడ్చి పెట్టారు. జంతు సంక్షేమ కార్యకర్త ఫిర్యాదుతో పోలీసులు సర్పంచ్, PSపై కేసు నమోదు చేశారు.
News March 15, 2026
దుబాయ్లోనే ఉంటాం: విదేశీయులు

యుద్ధంలో దుబాయ్ నష్టపోతున్నా అక్కడ నివసిస్తున్న విదేశీయులు ఆ దేశంపై నమ్మకం చూపిస్తున్నారు. ఇప్పటికే ఇరాన్ దుబాయ్పై 300 మిస్సైళ్లు, 1,567 డ్రోన్లను ప్రయోగించింది. వీటిలో 90% ఆయుధాలను UAE అడ్డుకుంది. అయితే వాటి శిథిలాలు జనావాసాలు, వ్యాపార భవంతులపై పడ్డాయి. దుబాయ్ పాలకులపై నమ్మకం ఉందని, వారు తమను రక్షిస్తున్నారని ఇతర దేశస్థులు చెప్పారు. దుబాయ్ చాలా సురక్షితమైన నగరమని, వదిలే ఉద్దేశం లేదని తెలిపారు.
News March 15, 2026
యుద్ధం.. మరో జలసంధి క్లోజ్?

ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన ‘బాబ్ ఎల్-మండేబ్’ జలసంధిని హౌతీలు మూసివేసే అవకాశం ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. ఇప్పటికే హార్ముజ్ మూతపడటంతో గ్యాస్, చమురు సరఫరా అస్తవ్యస్తమైంది. ఇప్పుడు ఈ మార్గం కూడా క్లోజ్ అయితే 30% గ్లోబల్ ట్రేడ్పై ప్రభావం పడుతుంది. యూరప్ నుంచి సూయెజ్ కెనాల్ మీదుగా ఇండియా సహా ఆసియాకు వచ్చే నౌకలన్నీ నిలిచిపోతాయి. ఫలితంగా ఇంధన, వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది.


