News April 3, 2025

రామాయణ థీమ్‌తో థాయ్‌లాండ్‌ ఐస్టాంప్

image

థాయ్‌లాండ్‌లో PM మోదీ పర్యటనకు గుర్తుగా అక్కడి ప్రభుత్వం రామాయణ థీమ్‌తో ఐస్టాంప్‌ను విడుదల చేసింది. ఇది రెండు దేశాల సాంస్కృతిక సంబంధాలకు ఓ చిహ్నమని మోదీ ట్వీట్ చేశారు. థాయ్‌లాండ్ ఫౌండర్ కింగ్ రామ-1 పాలనలో చిత్రించిన రామకేయిన్(ఇతిహాసం) కుడ్య చిత్రాలను ఇది వర్ణిస్తుందని పేర్కొన్నారు. అలాగే పాలీ భాషలో బుద్ధిజంపై రాసిన టిపిటక కాపీని బహూకరించిన ప్రధాని పేటోంగ్‌టార్న్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News January 26, 2026

ఇతరుల అగ్గిపెట్టెతో దీపం వెలిగిస్తున్నారా..?

image

దీపారాధన చేసేటప్పుడు ఇతరుల అగ్గిపెట్టెను వాడకూడదని పండితులు సూచిస్తున్నారు. ఇది శుభప్రదం కాదంటున్నారు. ఇలా చేస్తే పుణ్యఫలం మీకు దక్కకుండా ఇతరులకు చేరుతుందని అంటున్నారు. ‘వెలుగుతున్న ఇతర దీపాలతోనూ దీపారాధన చేయకూడదు. సొంతంగా కొన్న అగ్గిపెట్టెనే వాడాలి. అలాగే స్నేహితులు, చుట్టాలతో గుడికి వెళ్లినప్పుడు పూజా సామగ్రి కూడా సొంత డబ్బుతోనే కొనుగోలు చేయాలి. అప్పుడే ఆ పుణ్యం మీకొస్తుంది’ అని చెబుతున్నారు.

News January 26, 2026

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

image

AP: వరుస సెలవుల ప్రభావంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే 84,014 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 35,131 మంది తలనీలాలు సమర్పించారు. ఆలయ హుండీ ఆదాయం రూ.3.69 కోట్లుగా నమోదైంది. భక్తులు దర్శనానికి ముందుగా సరైన ప్రణాళికతో రావాలని, భద్రతా సూచనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

News January 26, 2026

Republic day Special: స్వాతంత్య్రోద్యమంలో నారీ శక్తి

image

భారత స్వాతంత్య్ర సమరంలో ఎందరో వీరవనితలు పాలుపంచుకున్నారు. 1857కు ముందే రాణి అబ్బక్క చౌతా, రాణి వేలు నాచియార్‌, కిట్టూరు చెన్నమ్మ సమరశంఖం పూరించగా, సిపాయిల ఉద్యమ కాలంలో ఝాన్సీ లక్ష్మీబాయి, బేగం హజరత్‌ మహల్‌, 1885లో కస్తూర్బా గాంధీ, సరోజినీ నాయుడు, మేడం కామా, అనీబిసెంట్‌, ముత్తు లక్ష్మిరెడ్డి, లక్ష్మీ సెహగల్‌, సుచేత కృపాలాని, మాతంగిని హజ్రా, కమలాదేవి చటోపాధ్యాయ, అరుణా అసఫ్‌ అలీ కీలకపాత్ర పోషించారు.