News March 24, 2024

థాంక్యూ గాడ్: రిషబ్ పంత్

image

రిషబ్ పంత్ ఎట్టకేలకు నిన్న ఐపీఎల్ మ్యాచ్‌ ద్వారా గ్రౌండ్‌లో అడుగుపెట్టారు. అతడి సారథ్యంలోని ఢిల్లీ, పంజాబ్‌ చేతిలో ఓటమిపాలైంది. అయితే, తాను గ్రౌండ్‌లో దిగడమే చాలా సంతోషమంటూ పంత్ ట్వీట్ చేశారు. ‘దేవుడికి, అందరికీ కృతజ్ఞతలు. మళ్లీ ఫీల్డ్‌లోకి రావడం చాలా సంతోషంగా ఉంది. మేం అనుకున్న ఫలితం దక్కలేదు కానీ ప్రతిరోజూ మెరుగవుతాం. 100 శాతం కష్టపడతాం. గ్రౌండ్‌లో ఉండటం సంతోషాన్ని ఇచ్చింది’ అని పేర్కొన్నారు.

Similar News

News November 19, 2025

సినిమా అప్డేట్స్

image

* విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో నితిన్ ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రంలో నటిస్తారని సమాచారం. వీరి కాంబోలో వచ్చిన ‘ఇష్క్’ సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే.
* సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ చిత్రంలో నటిస్తారని టాక్. ఇందులో మిలిటరీ ఆఫీసర్ పాత్రలో పవర్ స్టార్ కనిపిస్తారని సమాచారం.
* జూనియర్ ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమా తర్వాతి షెడ్యూల్ డిసెంబర్‌లో శ్రీలంకలో జరుగుతుందని సినీ వర్గాలు వెల్లడించాయి.

News November 19, 2025

హసీనాకు మరణశిక్ష.. కుమారుడి స్పందనిదే..

image

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు <<18311087>>మరణశిక్ష<<>> విధిస్తూ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ తీసుకున్న నిర్ణయంపై ఆమె కుమారుడు సాజిబ్ వాజీద్ స్పందించారు. కేసుల విచారణలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం న్యాయ ప్రక్రియను పాటించలేదని ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ మార్పుకు జో బైడెన్ సర్కారు మిలియన్ డాలర్లు వెచ్చించిందని విమర్శించారు. అయితే, ట్రంప్ ప్రభుత్వ వైఖరి వేరుగా ఉందని సాజిబ్ అభిప్రాయపడ్డారు.

News November 19, 2025

బి.టి పత్తికి గులాబీ రంగు పురుగుతో ముప్పు

image

బి.టి పత్తిని నవంబర్, డిసెంబర్ నెలలో గులాబీ రంగు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగు చిన్న లార్వాలు పూమొగ్గలు, లేతకాయలకు చిన్న రంద్రాలు చేసి లోపలకి ప్రవేశిస్తాయి. పూలలోని మొగ్గలను తినేయడం వల్ల పూలు విచ్చుకోవు. కాయల లోపలి భాగాన్ని తినేయడం వల్ల కాయ ఎదగదు. అలాగే ఇవి కాయల్లోని విత్తనం లోపలి భాగాన్ని, దూదిని కొరికి తినడం వల్ల దూది నాణ్యత తగ్గి రంగు కూడా మారుతుంది. ఫలితంగా దిగుబడి, రాబడి తగ్గుతుంది.