News February 4, 2025
14వ ఏడాదీ అవకాశమిచ్చినందుకు థాంక్స్: మోదీ

పార్లమెంటులో వరుసగా 14వ ఏడాదీ ప్రసంగించే అవకాశం కల్పించిన దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ ధన్యవాదాలు తెలియజేశారు. తనను నాయకుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగం వికసిత భారత్కు బాటలు వేసిందన్నారు. తమ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. గరీబీ హఠావో ప్రయోగం విఫలమైందని కాంగ్రెస్ను విమర్శించారు. తాము పేదలకు 4 కోట్ల ఇళ్లు కట్టించామని వెల్లడించారు.
Similar News
News November 24, 2025
UCIL 107 ఉద్యోగాలకు నోటిఫికేషన్

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(<
News November 24, 2025
మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు.. రూ.304 కోట్లు జమ

TG: రాష్ట్ర ప్రభుత్వం రూ.304 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేసింది. 3,57,098 గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో ఈ నగదు జమ చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఆధ్వర్యంలో డీఆర్డీఏ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వేల కోట్ల రూపాయల నిధులను సమకూరుస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.
News November 24, 2025
VIRAL: ట్రంప్ జూనియర్తో రామ్ చరణ్

US ఫార్మా దిగ్గజం రామరాజు మంతెన కుమార్తె వివాహ వేడుక ఉదయ్పూర్లోని రాజభవనంలో ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ను కలుసుకున్నారు. వీరిద్దరూ సరదాగా మాట్లాడుకుంటున్న ఫొటో ఒకటి వైరలవుతోంది. ఇదీ చరణ్ రేంజ్ అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.


