News February 4, 2025
14వ ఏడాదీ అవకాశమిచ్చినందుకు థాంక్స్: మోదీ

పార్లమెంటులో వరుసగా 14వ ఏడాదీ ప్రసంగించే అవకాశం కల్పించిన దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ ధన్యవాదాలు తెలియజేశారు. తనను నాయకుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగం వికసిత భారత్కు బాటలు వేసిందన్నారు. తమ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. గరీబీ హఠావో ప్రయోగం విఫలమైందని కాంగ్రెస్ను విమర్శించారు. తాము పేదలకు 4 కోట్ల ఇళ్లు కట్టించామని వెల్లడించారు.
Similar News
News January 23, 2026
INDvsNZ 4వ T20.. టికెట్లు విడుదల

భారత్-న్యూజిలాండ్ మధ్య 28వ తేదీన జరగనున్న 4వ T20కి టికెట్లు విడుదలయ్యాయి. ఏపీ విశాఖలోని ACA-VDCA క్రికెట్ స్టేడియంలో బుధవారం రాత్రి 7గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లు district యాప్లో అందుబాటులో ఉన్నాయి.
News January 23, 2026
‘MSVPG’కి పెంచిన టికెట్ ధరల లెక్కలు ఇవ్వండి: HC

TG: చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా టికెట్ ధరల పెంపునకు సంబంధించి వాస్తవ లెక్కలను సమర్పించాలని GST అధికారులను హైకోర్టు ఆదేశించింది. చట్టవిరుద్ధంగా టికెట్ ధరలను పెంచారని దాఖలైన పిటిషన్పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. రూ.45 కోట్లు అక్రమంగా సంపాదించారని, వాటిని రికవరీ చేయాలని పిటిషనర్ శ్రీనివాస రెడ్డి కోరారు. కోర్టు ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసి విచారణను వాయిదా వేసింది.
News January 23, 2026
కేటీఆర్ విచారణ @6 గంటలు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ విచారణ సుమారు 6 గంటలుగా కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పీఎస్లో సిట్ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. విచారణ సుదీర్ఘంగా కొనసాగుతుండటంతో ఏం జరగనుందో అని పీఎస్ బయట BRS శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. పోలీసులకు వ్యతిరేకంగా మహిళా కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.


