News March 6, 2025
ఏపీ, తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు: మోదీ

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో BJP, కూటమి అభ్యర్థులు విజయం సాధించడంపై ప్రధాని మోదీ స్పందించారు. ఏపీ, తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని దీవించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో NDA కూటమి విజయంపైనా హర్షం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధి ప్రయాణాన్ని NDA కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని భరోసా ఇచ్చారు.
Similar News
News March 6, 2025
ప్రముఖ సింగర్తో ఎంపీ తేజస్వీ వివాహం

బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య కర్ణాటక గాయని శివశ్రీ స్కందప్రసాద్ను పెళ్లి చేసుకున్నారు. ఎలాంటి హడావిడీ లేకుండా సంప్రదాయ పద్ధతిలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. వివాహానికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. శివశ్రీ మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి భరతనాట్యంలో MA & చెన్నై సంస్కృత కళాశాల నుంచి సంస్కృతంలో MA పట్టా పొందారు. కర్ణాటకలో భరతనాట్య కళాకారిణిగా, సింగర్గా ప్రసిద్ధి చెందారు.
News March 6, 2025
పోలీసుల విచారణకు హాజరైన గోరంట్ల మాధవ్

AP: వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విజయవాడ సైబర్ క్రైమ్ పీఎస్లో పోలీసుల విచారణకు హాజరయ్యారు. అత్యాచార బాధితుల పేర్లను బయటపెట్టారని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదుతో మాధవ్పై కేసు నమోదైంది. ఇలా పేర్లు బయటపెట్టడం నిబంధనలకు విరుద్ధమని గతేడాది నవంబర్ 2న పద్మ ఫిర్యాదులో పేర్కొన్నారు.
News March 6, 2025
BIG BREAKING: హైకోర్టు సంచలన తీర్పు

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. లగచర్ల, హకీంపేటలో భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేసింది. కాగా భూసేకరణను వ్యతిరేకిస్తూ, ఇక్కడ ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయడంపై అభ్యంతరం చెబుతూ దాఖలైన పిటిషన్లపై పలువురు కోర్టును ఆశ్రయించారు. ఆయా ప్రాంతాల్లో భూసేకరణ సమయంలో ఆందోళనలు జరిగి పలువురిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.