News November 12, 2024
థాంక్స్ శివయ్య.. భక్తి చాటిన వానరం

TG: ఓ వానరం శివలింగం వద్ద చేసిన సందడి ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. కార్తీకమాసం సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని శివలింగం వద్ద భక్తులు పూజలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉంచిన ప్రసాదాలు, అరటిపండ్లను వానరాలు ఆరగించాయి. వాటిల్లో ఓ కోతి శివలింగంపై తలపెట్టి వేడుకున్నట్లు కనిపించింది. ఆహారం ఇచ్చినందుకు థాంక్స్ చెప్పినట్లు ఆ దృశ్యం ఉందని అక్కడున్న వారు చర్చించుకున్నారు.
Similar News
News December 29, 2025
ప్రభాస్ హీరోయిన్ల డ్రెస్సింగ్పై RGV ట్వీట్

శివాజీ వ్యాఖ్యలతో హీరోయిన్ల డ్రెస్సింగ్పై చర్చ జరుగుతున్న వేళ <<18683006>>RGV<<>> మరోసారి ఈ విషయంపై స్పందించారు. ‘రాజాసాబ్’ ప్రీరిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ నిధి, మాళవిక, రిద్ధి వేసుకున్న డ్రెస్సులను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ‘ప్రభాస్ హీరోయిన్స్ శివాజీ అండ్ కో అరుపులు పట్టించుకోకుండా వారికి నచ్చిన దుస్తులను ధరించారు. ఈ ముగ్గురు ‘హీరో’ (హీరోయిన్లను అభివర్ణిస్తూ)లు ఆ విలన్ల చెంప పగలగొట్టారు’ అని ట్వీట్ చేశారు.
News December 29, 2025
నేటి ముఖ్యాంశాలు

* కొత్త ఆశలు, సంకల్పంతో నూతన ఏడాదిలోకి: PM మోదీ
* పేదల హక్కులపై BJP దాడి: ఖర్గే
* రేపు అసెంబ్లీకి హాజరుకానున్న కేసీఆర్
* నీటిపారుదల శాఖపై CM రేవంత్ సమీక్ష.. అసెంబ్లీలో లేవనెత్తే ప్రశ్నలపై వ్యూహం సిద్ధం
* అయోధ్యను దర్శించుకున్న CM CBN.. శ్రీరాముడి విలువలు అందరికీ ఆదర్శమని ట్వీట్
* శ్రీలంక ఉమెన్స్తో 4వ టీ20లో భారత్ విజయం
* భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కేజీ రూ.300
News December 29, 2025
నెహ్రూ లేఖలను తిరిగి ఇచ్చేయండి: కేంద్రమంత్రి

జవహర్లాల్ నెహ్రూకు సంబంధించిన కీలక లేఖలు, పత్రాలు దేశ వారసత్వ సంపద అని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు. వీటిని వెంటనే ‘ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ’కి తిరిగి అప్పగించాలని సోనియా గాంధీని కోరారు. అవి కుటుంబ ఆస్తి కాదని.. దేశ చరిత్రను తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందన్నారు. 2008లో దాదాపు 26,000 పత్రాలను తీసుకెళ్లారని.. గతంలో పలుమార్లు కోరినా తిరిగి ఇవ్వలేదని గుర్తు చేశారు.


