News January 6, 2025

టీమ్ ఇండియా ఓటమికి కారణం అదే: గంగూలీ

image

BGT సిరీస్‌లో టీమ్ ఇండియా ఓటమికి బ్యాటింగ్‌లో వైఫల్యమే కారణమని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. ‘టెస్ట్ క్రికెట్‌లో పరుగులు చేయడం చాలా ముఖ్యం. 170, 180 రన్స్ చేస్తే మ్యాచులు గెలవలేం. 350-400 పరుగులు చేయాలి. ఓటమి విషయంలో ఎవరినీ నిందించలేం. అందరూ రన్స్ చేయాల్సిందే’ అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. BGTలో రోహిత్, కోహ్లీ బ్యాటింగ్‌పై విమర్శలొస్తున్న సంగతి తెలిసిందే.

Similar News

News November 28, 2025

వైకుంఠ ద్వార దర్శనం: టికెట్లు ఇలా బుక్ చేయండి

image

TTD అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి మొదటి 3 రోజులకు (DEC 31, 31, JAN 1) టికెట్లు బుక్ చేసుకోవచ్చు. వాట్సప్ నంబర్ 9552300009కి HI లేదా GOVINDA అని మెసేజ్ చేసి, వివరాలు ఇవ్వడం ద్వారా కూడా టికెట్లు బుక్ అవుతాయి. ఒక నంబర్‌తో గరిష్ఠంగా నలుగురికి బుక్ చేసుకోవచ్చు. DEC 1 వరకు ఛాన్సుంది. ఆ తర్వాత టికెట్లను లక్కీ డిప్ తీస్తారు. ఎంపికైన వారికి మొదటి 3 రోజుల్లో ఉచిత దర్శన భాగ్యం దక్కుతుంది.

News November 28, 2025

మరోసారి మెగా పీటీఎం

image

AP: మరోసారి మెగా పేరెంట్-టీచర్స్ మీట్ నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. DEC 5న జూనియర్ కాలేజీలతో పాటు 45వేల ప్రభుత్వ బడుల్లో ఈ ప్రోగ్రాం జరగనుంది. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను చూపించి తల్లిదండ్రులతో క్లాస్ టీచర్ మాట్లాడనున్నారు. మంత్రి లోకేశ్ మన్యం జిల్లాలో నిర్వహించే మెగా పీటీఎం‌లో పాల్గొంటారు. గతేడాది మొదటిసారి, ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో రెండోది, వచ్చే నెల మూడో మెగా పీటీఎం జరగనుంది.

News November 28, 2025

వైకుంఠ ద్వార దర్శనం: లక్కీ డిప్‌లో సెలెక్ట్ అవ్వకపోతే..?

image

వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు ఉంటుంది. అందులో మొదటి 3 రోజులు మాత్రమే లక్కీ డిప్ ద్వారా భక్తులను ఎంపిక చేస్తారు. లక్కీ డిప్‌లో సెలక్ట్ అవ్వని భక్తులకు నిరాశ అనవసరం. JAN 2 – JAN 8వ వరకు రోజుకు 15K చొప్పున విడుదలయ్యే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. వీటిని బుక్ చేసుకున్న అందరికీ వైకుంఠ ద్వారం గుండా దర్శనం లభిస్తుంది. ఇవి DEC 5న విడుదలవుతాయి. ఫాస్ట్‌గా బుక్ చేసుకోవాలి.