News May 19, 2024
ఆ కారణంగానే భారత్తో వాణిజ్య బంధం తెగింది: పాక్

పుల్వామా ఉగ్రదాడి తర్వాతే పాకిస్థాన్ దిగుమతులపై భారత్ ఆంక్షలు విధించడం ప్రారంభించిందని ఆ దేశ విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ తెలిపారు. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం నిలిచిపోయిందన్నారు. పుల్వామా ఘటన తర్వాత పాక్ నుంచి వచ్చే దిగుమతులపై 200 శాతం సుంకం విధించాలని భారత్ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కాగా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే విధానానికి పాక్ స్వస్తి పలకాలని ఇండియా డిమాండ్ చేస్తోంది.
Similar News
News November 25, 2025
డబుల్ బెడ్ రూమ్ ఫ్లోరింగ్ కుంగిన ఘటనపై విచారణకు ఆదేశం

వేములవాడ శివారులోని ఆర్టీసీ డిపో సమీపంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఫ్లోరింగు కుంగిన ఘటనపై జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ విచారణకు ఆదేశించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సందర్శించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టామని, నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శంకర్ తెలిపారు.
News November 25, 2025
డబుల్ బెడ్ రూమ్ ఫ్లోరింగ్ కుంగిన ఘటనపై విచారణకు ఆదేశం

వేములవాడ శివారులోని ఆర్టీసీ డిపో సమీపంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఫ్లోరింగు కుంగిన ఘటనపై జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ విచారణకు ఆదేశించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సందర్శించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టామని, నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శంకర్ తెలిపారు.
News November 25, 2025
పోలీసుల రూల్స్ కేవలం హిందువులకేనా?: రాజాసింగ్

TG: అయ్యప్ప మాల వేసుకున్న హైదరాబాద్ కంచన్బాగ్ ఎస్సైకి ఉన్నతాధికారులు మెమో జారీ చేయడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైరయ్యారు. పోలీసుల రూల్స్ కేవలం హిందువులకే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. ముస్లిం సోదరులకు ఫ్రీడమ్ ఇచ్చి హిందూ పోలీసులకు ఎందుకు ఇవ్వట్లేదని నిలదీశారు. రంజాన్ సమయంలో ఇలాంటి రూల్స్ ఎందుకు పెట్టరని మండిపడ్డారు. చట్టాలు అందరికీ సమానంగా ఉండాలని సూచించారు.


