News October 31, 2024

ఆ ఆస్తిని పేద పిల్లలకు పంచాలి: మంత్రి సత్యకుమార్

image

AP: అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించిన ఆస్తుల సమస్యను ఇద్దరు తోడుదొంగలు అంతర్జాతీయ సమస్యగా మార్చారని మంత్రి సత్యకుమార్ ఎద్దేవా చేశారు. తనకు రక్షణ కల్పించాలన్న చెల్లి కొత్త నాటకం మాయాబజార్‌ను తలపిస్తోందని ట్వీట్ చేశారు. ‘అక్రమంగా సంపాదించిన వ్యక్తులను సమాజం బహిష్కరించాలి. ఆస్తులను నలుగురు పిల్లలకు కాదు, కోట్లాది పిల్లలకు పంచాలి. అప్పుడే నిజమైన దీపావళి’ అని పేర్కొన్నారు.

Similar News

News December 14, 2025

15 రోజుల్లో ‘అవుకు’ లీకేజీలకు మరమ్మతు పూర్తి : జనార్దన్ రెడ్డి

image

AP: నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్‌ను మంత్రి జనార్దన్ రెడ్డి సందర్శించారు. ‘15 ఏళ్లుగా రిజర్వాయర్లో లీకేజీల సమస్య ఉంది. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. లీకేజీలు లేకుండా మరమ్మతు చేయిస్తున్నాం. ఇప్పటికే నిపుణులు వాటిని గుర్తించి కాంక్రీట్‌తో ఫిల్ చేస్తున్నారు’ అని మంత్రి తెలిపారు. ఇటీవల కట్ట కొద్దిగా కుంగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారన్నారు. 15 రోజుల్లో పనులు పూర్తవుతాయని, భయపడొద్దని సూచించారు.

News December 14, 2025

ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్

image

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం ఒంటి గంటలోపు లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. మ.2 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా, సా.5గంటలలోపు ఫలితాలు వచ్చే అవకాశముంది. రెండో విడతలో 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 3,911 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్ లైవ్ అప్డేట్స్ వే2న్యూస్‌లో తెలుసుకోవచ్చు.

News December 14, 2025

బౌండరీల వర్షం.. అదరగొట్టిన జైస్వాల్, సర్ఫరాజ్

image

SMATలో హరియాణాతో జరిగిన మ్యాచులో ముంబై బ్యాటర్లు అదరగొట్టారు. 235 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలో ఛేదించారు. ఓపెనర్ జైస్వాల్ 48 బంతుల్లో సెంచరీ (16 ఫోర్లు, 1 సిక్సు) చేయగా, సర్ఫరాజ్ ఖాన్ 25 బంతుల్లో 64 రన్స్(9 ఫోర్లు, 3 సిక్సులు)తో రాణించారు. 3వ ఓవర్లో జైస్వాల్ వరుసగా 6, 4, 4, 4 బాదగా, 6వ ఓవర్లో సర్ఫరాజ్ వరుసగా 6, 0, 4, 4, 4, 4 సాధించారు. 7వ ఓవర్లోనూ 4 ఫోర్లతో బౌండరీల వర్షం కురిపించారు.