News October 31, 2024
ఆ ఆస్తిని పేద పిల్లలకు పంచాలి: మంత్రి సత్యకుమార్

AP: అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించిన ఆస్తుల సమస్యను ఇద్దరు తోడుదొంగలు అంతర్జాతీయ సమస్యగా మార్చారని మంత్రి సత్యకుమార్ ఎద్దేవా చేశారు. తనకు రక్షణ కల్పించాలన్న చెల్లి కొత్త నాటకం మాయాబజార్ను తలపిస్తోందని ట్వీట్ చేశారు. ‘అక్రమంగా సంపాదించిన వ్యక్తులను సమాజం బహిష్కరించాలి. ఆస్తులను నలుగురు పిల్లలకు కాదు, కోట్లాది పిల్లలకు పంచాలి. అప్పుడే నిజమైన దీపావళి’ అని పేర్కొన్నారు.
Similar News
News December 21, 2025
ప్రకృతి సేద్యంలో ఈ ద్రావణాలు కీలకం.. తయారీ ఎలా?

ప్రకృతి సేద్యం పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే నేడు చాలా మంది రైతులు ప్రకృతి సాగువైపు అడుగులేస్తున్నారు. ఈ విధానంలో తొలుత లాభాలు ఆలస్యమైనా, కొంత కాలానికి రసాయన సాగు చేస్తున్న రైతులతో సమానంగా ఆదాయం వస్తుంది. ప్రకృతి సేద్యంలో అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, నీమాస్త్రం కీలక పాత్ర పోషిస్తాయి. వీటి తయారీ విధానం కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 21, 2025
దేశంలో అదనంగా 75వేల మెడికల్ సీట్స్: నడ్డా

దేశంలో పేద, అణగారిన వర్గాలకు మంచి వైద్యం అందుతోందని కేంద్రమంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ‘ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాలు ఆలస్యం చేయకుండా పేదలకు కూడా వైద్యం చేసేలా చేస్తున్నాయి. 70ఏళ్లు దాటితే ఆదాయం, కులం, మతంతో సంబంధంలేకుండా మెడికల్ ఇన్యూరెన్స్ పరిధిలోకి వస్తారు. ప్రధాని మోదీ నేతృత్వంలో 2029నాటికి దేశంలో మెడికల్ సీట్స్ సంఖ్య 75వేలు వరకు పెరుగుతాయి. గతేడాదే 23వేల సీట్లు పెంచాం’ అని తెలిపారు.
News December 21, 2025
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

విశాఖపట్నంలోని<


