News March 20, 2024

జంక్ ఫుడ్ ఎంత పని చేసింది

image

జంక్ ఫుడ్ తినొద్దని తండ్రి మందలించినందుకు కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాష్ట్రలో జరిగింది. నాగ్‌పూర్‌లో బీబీఏ చేస్తున్న భూమిక వినోద్ ధన్వానీ థైరాయిడ్ సమస్యతో బాధపడుతోంది. జంక్ ఫుడ్ తింటే ఆరోగ్యం మరింత దెబ్బతినే అవకాశం ఉండటంతో తండ్రి మందలించారు. కలతచెందిన యువతి వంటగదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై యాక్సిడెంటల్ డెత్‌గా పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News January 19, 2026

సంతానలేమిని నివారించే ఖర్జూరం

image

ఖర్జూరాలు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడతాయని.. మగవారిలో సంతానలేమి సమస్యను నివారించడంలో ఉపయోగపడతాయని పలు అధ్యయనాల్లో తేలింది. వీటిలో ఉన్న పొటాషియం నరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఖర్జూరాల్లో అధికంగా ఉండే పీచు జీర్ణ ప్రక్రియకు మంచిది. ఇందులోని కెరోటనాయిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే ఐరన్, విటమిన్ C, D, విటమిన్ B కాంప్లెక్స్ గర్భిణులకు మంచివని చెబుతున్నారు.

News January 19, 2026

రబీ వరిలో పెరిగిన తెగుళ్లు – కట్టడికి కీలక సూచనలు

image

తెలుగు రాష్ట్రాల్లో వరి పంట వివిధ దశల్లో ఉంది. ప్రస్తుతం పెరిగిన చలి, వాతావరణ పరిస్థితుల వల్ల పంటలో పురుగులు, చీడపీడల ఉద్ధృతి బాగా పెరిగింది. ప్రధానంగా వరిలో కాండం తొలిచే పురుగు, సుడిదోమ, అగ్గి తెగులు, కాండం కుళ్లు/దుబ్బు కుళ్లు, జింకు లోపం కనిపిస్తున్నాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే పంట ఎదుగుదల తగ్గి, దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ తెగుళ్ల కట్టడికి కీలక సూచనల కోసం <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.

News January 19, 2026

మా కరెంట్‌తోనే భారత్‌లో AI సేవలు: US

image

భారత్‌లో AI సేవల కోసం అమెరికన్లు డబ్బులు చెల్లిస్తున్నారని ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఆరోపించారు. USలోని కరెంట్‌తోనే చాట్‌జీపీటీ వంటి ప్లాట్‌ఫామ్‌లు పనిచేస్తున్నాయని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. భారత్, చైనా వంటి దేశాల్లో పెద్ద సంఖ్యలో వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. అమెరికాతో వాణిజ్యం, రష్యాతో సంబంధాలపై భారత్ టార్గెట్‌గా నవారో గతంలోనూ పలు విమర్శలు చేశారు.