News December 28, 2024
దటీజ్ మన్మోహన్: ఆపరేషన్ తర్వాత తొలి ప్రశ్న.. ‘నా దేశం ఎలా ఉంది?’

మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా 2009లో హార్ట్ సర్జరీ జరిగింది. 11 గంటల శస్త్రచికిత్స తర్వాత బ్రీతింగ్ పైప్ తీసేయగానే ఆయన తన ఆరోగ్యం గురించి కాకుండా దేశం ఎలా ఉంది? కశ్మీర్ ఎలా ఉంది? అని అడిగారు. తన ధ్యాసంతా సర్జరీపై కాకుండా దేశంపైనే ఉందని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ఆయనకు సర్జరీ చేసిన డాక్టర్ రమాకాంత్ పాండా ఓ సందర్భంలో వెల్లడించారు. మన్మోహన్ మానసికంగా చాలా బలంగా ఉండేవారని తెలిపారు.
Similar News
News November 13, 2025
ఆ సినిమాలు చూసి నన్ను చంపాలనుకున్నారు: అదా శర్మ

రిస్క్ ఉన్న క్యారెక్టర్లను ఎంపిక చేసుకుని, నటించినప్పుడే కెరీర్కు విలువ పెరుగుతుందని హీరోయిన్ అదా శర్మ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ది కేరళ స్టోరీ, బస్తర్: ది నక్సల్ స్టోరీ మూవీలు రిలీజైన తర్వాత బెదిరింపులు ఎదుర్కొన్నాను. దేశంలో సగం మంది నన్ను చంపాలని కోరుకున్నారు. మిగిలిన వారు ప్రశంసించారు. వాళ్లే నన్ను కాపాడారు. నేను యాక్షన్, భావోద్వేగం, రిస్క్ ఉన్న స్క్రిప్ట్నే ఎంపిక చేసుకుంటా’ అని చెప్పారు.
News November 13, 2025
CBN గారూ.. మీ ‘క్రెడిట్ చోరీ స్కీం’ చాలా బాగుంది: జగన్

AP: క్రెడిట్ చోరీలో మీకు మీరే సాటి అంటూ CM CBNపై YCP అధినేత జగన్ విమర్శలకు దిగారు. ‘YCP హయాంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను మేమే కట్టేశామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మీ క్రెడిట్ చోరీ స్కీం చాలా బాగుంది. 3,00,092 ఇళ్లలో ఒక్క ఇంటిపట్టా కూడా మీరు ఇవ్వలేదు. ఒక్క ఇల్లూ మంజూరు చేయించలేదు. 1,40,010 ఇళ్లు మా హయాంలోనే పూర్తయ్యే దశలో ఉన్నాయి. మరో 87వేల ఇళ్లు శ్లాబ్ లెవల్ వరకు కట్టించినవే’ అని ట్వీట్ చేశారు.
News November 13, 2025
వంటింటి చిట్కాలు

* కరివేపాకును ఎండబెట్టి పొడిచేసుకుని కూరల్లో వేసుకుని తింటే కమ్మటి వాసన వస్తుంది.
* తేనె సీసాలో రెండు మిరియాలు వేస్తే చీమలు రావు.
* బియ్యం పురుగు పట్టకూడదంటే కరివేపాకులు వేయాలి.
* కొబ్బరి ముక్కను పెరుగులో వేస్తే త్వరగా పెరుగు పాడవదు.
* నెయ్యి పేరుకుపోకుండా ఉండాలంటే మీగడ కట్టేటప్పుడు కొద్దిగా నీళ్లు చల్లాలి.
* చిటికెడు సోడా వేసి గోధుమ పిండిని తడిపితే పూరి మెత్తగా, రుచిగా ఉంటుంది.


