News March 26, 2024
అలా బతకడమే బెస్ట్: శ్రద్ధా కపూర్
స్టార్డమ్ అనేది శాశ్వతంగా ఉండదని బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ అన్నారు. అందుకే సామాన్యురాలిగా బతకడమే బెస్ట్ అని చెప్పారు. ఇప్పటికీ తానే స్వయంగా మార్కెట్కి వెళ్లి నచ్చినవి తెచ్చుకుంటానని చెప్పారు. అందరితో కలిసి పావ్ బాజీ తింటానని.. అందులోనే ఆనందం ఉందన్నారు. ఇటీవల ఫ్యాన్స్తో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న ఈ అమ్మడిని ‘మోస్ట్ స్టైలిష్ ఫ్యాన్ ఫేవరెట్ సూపర్ స్టార్’ అవార్డుతో సత్కరించారు.
Similar News
News October 6, 2024
ప్రకటించిన అవార్డులను రద్దు చేయవచ్చా?
జాతీయ చలనచిత్ర అవార్డుల రద్దుకు నిర్దిష్ట నిబంధనలు లేకపోయినా అడ్మినిస్ట్రేటివ్ లా కింద రద్దు చేసే అధికారం అవార్డుల కమిటీకి ఉంటుంది. ఏ గుర్తింపుకైతే సదరు వ్యక్తికి అవార్డు ప్రకటించారో దానికి సంబంధించి కాపీ రైట్స్, క్రెడిట్స్ అవకతవకలు, ప్రలోభాలకు పాల్పడడం, నేరాభియోగాలపై అవార్డు రద్దు చేస్తారు. ఈ గ్రౌండ్స్పైనే జానీ మాస్టర్కు ప్రకటించిన అవార్డును తాత్కాలికంగా నిలిపివేశారు.
News October 6, 2024
రేపు వారి అకౌంట్లలో డబ్బులు జమ
AP: సాంకేతిక కారణాలతో పరిహారం అందని వరద బాధితులకు ప్రభుత్వం రేపు డబ్బులు అందించనుంది. మొత్తం 21,768 మంది ఖాతాల్లో రూ.18.69 కోట్లను జమచేయనున్నట్లు అధికారులు తెలిపారు. అందరికీ సాయం అందుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. వరద బాధితులకు ప్రభుత్వం గత నెలలో రూ.602 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. బ్యాంకు ఖాతాల్లో తప్పులు, ఆధార్ లింక్ కాకపోవడం వల్ల కొందరికి డబ్బులు జమకాలేదు.
News October 6, 2024
ఘోరం.. 1.7లక్షల మందికి ఒక్క టాయిలెట్!
బెంగళూరు అభివృద్ధిలో దూసుకెళ్తోంది. కానీ, అక్కడున్న 1.4 కోట్ల మంది ప్రజలకు కనీస మౌలిక సదుపాయమైన టాయిలెట్లను ఏర్పాటు చేయలేకపోయింది. నగరంలో 803 పబ్లిక్ టాయిలెట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు RV యూనివర్సిటీ నివేదికలో వెల్లడైంది. ఈ లెక్కన ప్రతి 1.7లక్షల మందికి ఓ టాయిలెట్ ఉందన్న మాట. వీటిలోనూ సగం వాటిల్లో లైట్స్ లేవని తేలింది. కాగా HYDలోనూ టాయిలెట్స్ పెంచాలని నెటిజన్లు కోరుతున్నారు.