News July 4, 2024
భోలేబాబాను అందుకే అరెస్ట్ చేయలేదు: పోలీసులు

తొక్కిసలాటకు కారణమైన భోలేబాబాను ఇంకా అరెస్ట్ చేయకపోవడానికి UP పోలీసులు చెప్పిన సమాధానంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ‘సేవాదార్ వేద్ ప్రకాశ్ మధుకర్ పేరిట సత్సంగ్ నిర్వహణకు అనుమతి తీసుకున్నారు. అందుకే నిర్వహణ కమిటీ సభ్యులను అరెస్ట్ చేశాం. భోలేబాబాను కూడా విచారిస్తాం. ప్రస్తుతం ఆయన ఆచూకీ తెలియడంలేదు’ అని తెలిపారు. బాబా వెనకాల రాజకీయ శక్తులుండటంతోనే ఆయనను అరెస్ట్ చేయడంలేదని ఆరోపణలొస్తున్నాయి.
Similar News
News January 2, 2026
IIIT పుణేలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

<
News January 2, 2026
ముస్తాఫిజుర్ IPLలో ఆడతారా? BCCI రిప్లై ఇదే?

బంగ్లాదేశ్లో హిందువులపై వరుస <<18733577>>దాడుల<<>> నేపథ్యంలో ఆ దేశ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ను IPLలో ఆడించొద్దన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. అయితే బంగ్లా ప్లేయర్లను బ్యాన్ చేయాలంటూ కేంద్రం నుంచి తమకు ఎలాంటి ఆదేశాల్లేవని BCCI ప్రతినిధి ఒకరు చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. మరోవైపు ముస్తాఫిజుర్ను జట్టు నుంచి తొలగించాలని KKR, ఆ టీమ్ ఓనర్ షారుఖ్ ఖాన్ను పలువురు హిందూ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు.
News January 2, 2026
అధిక వడ్డీ ఆశ చూపి మోసం.. ప్రభుత్వం చర్యలు

AP: కర్నూలు జిల్లాలో అధిక వడ్డీ ఇస్తామంటూ స్కీమ్లతో మోసం చేసిన ‘శ్రేయ గ్రూప్’పై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఓనర్లు హేమంత్ కుమార్, సంగీతారాయ్ పేరిట ఉన్న ఆస్తులు సీజ్ చేసేందుకు CIDకి అనుమతి ఇచ్చింది. దీంతో జూపాడుబంగ్లా మండలం పారుమంచాలలో 51.55 ఎకరాల భూమిని CID సీజ్ చేయనుంది. భార్యాభర్తలైన హేమంత్, సంగీత 8,128 మంది డిపాజిటర్ల నుంచి రూ.206 కోట్లు వసూలు చేసి చేతులెత్తేశారు.


