News September 22, 2024
అందుకే గాంధీ వచ్చారు: శ్రీధర్ బాబు

TG: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సీఎల్పీ సమావేశం జరగడంతో సీఎంను కలిసేందుకు ఎమ్మెల్యే అరెకపూడి <<14167699>>గాంధీ<<>> వచ్చారని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. హరీశ్ రావు నియోజకవర్గానికి సీఎం వెళ్తే ఆయన వెళ్తారా లేదా అని ప్రశ్నించారు. అసత్యాలు ప్రచారం చేయడంలో బీఆర్ఎస్ దిట్ట అని విమర్శించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
Similar News
News December 6, 2025
నితీశ్ కొడుకు రాజకీయాల్లోకి రావొచ్చు: JDU నేత

బిహార్ CM నితీశ్కుమార్ తనయుడు నిశాంత్ త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. JDU జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్కుమార్ వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. “పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. నిర్ణయం మాత్రం ఆయనదే” అని అన్నారు. ఇటీవల ఎన్నికల్లో నిశాంత్ పోటీ చేయకపోయినా కీలక బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
News December 6, 2025
మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

AP: తూర్పుగోదావరి జిల్లాలోని మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖలో 12 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. కేస్ వర్కర్, MTS, సోషల్ వర్కర్, ఎడ్యుకేటర్, కుక్, సైకో-సోషల్ కౌన్సెలర్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, PG, సైకాలజీ డిప్లొమా/న్యూరో సైన్స్ , LLB, B.Sc. B.Ed, టెన్త్, ఏడో తరగతి అర్హతతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్: eastgodavari.ap.gov.in
News December 6, 2025
పిల్లల ఎదుగుదలలో తొలి రెండేళ్లూ కీలకం

పిల్లలు ఎదిగే క్రమంలో శారీరకంగానూ మానసికంగానూ తొలి రెండేళ్ల వయసూ చాలా కీలకమంటున్నారు నిపుణులు. దాదాపు 90 శాతం మెదడు ఎదుగుదల తొలి రెండేళ్లలోనే జరుగుతుంది. కాబట్టి మేధోపరంగా, ఆరోగ్యపరంగా వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ రెండేళ్లలోనే నిర్ణయమైపోతుంది. పైగా ఆ వయసులో పిల్లల మెదడు పెద్దల మెదడుకన్నా రెట్టింపు చురుగ్గా ఉంటుంది. పరిసరాలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటే పిల్లల ఎదుగుదల అంత బావుంటుందంటున్నారు.


