News January 21, 2025

అందుకే పనిష్మెంట్ ఇచ్చా: ఈటల

image

TG: తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరిపైనా చేయి ఎత్తలేదని, బూతులు తిట్టలేదని బీజేపీ MP ఈటల రాజేందర్ అన్నారు. కానీ పేదల భూములు కబ్జా అవుతున్నాయనే ఆవేదనతో, ధర్మాన్ని కాపాడేందుకు <<15213239>>ఇవాళ పనిష్మెంట్<<>> ఇచ్చానని చెప్పారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు అధర్మానికి కొమ్ము కాయడం సిగ్గుచేటన్నారు. ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి స్వయంగా చర్యలు తీసుకుని, ప్రజల ఆస్తులు కాపాడాలని డిమాండ్ చేశారు.

Similar News

News January 19, 2026

HYD: రూ.లక్షలు ఖర్చయ్యే గుండె ఆపరేషన్లు FREE

image

సనత్‌నగర్‌లో TIMS ఆసుపత్రిని గుండె, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కార్డియాక్ డిసీజ్ పేరిట ఏర్పాటు చేస్తున్నారు. 22.6 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు బ్లాకుల్లో, 16 మెజర్ ఆపరేషన్ థియేటర్లతో, రూ.1100 కోట్ల వ్యయంతో 1000 పడకల ఆసుపత్రిగా నిర్మించారు. రూ.లక్షలు ఖర్చు చేసే గుండె వైద్యం ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందనుంది.

News January 19, 2026

CMERIలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

CSIR-సెంట్రల్ మెకానికల్ ఇంజినీర్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ (<>CMERI<<>>)లో 20 టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెన్త్+ఐటీఐ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.37వేలు చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.cmeri.res.in

News January 19, 2026

YCP ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు

image

AP: లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు రావాలని అందులో పేర్కొంది. కాగా ఇప్పటికే ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈ నెల 22న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారనే ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది.