News October 24, 2024

అందుకే రైల్వే ప్రాజెక్టుల ఆలస్యం: కిషన్‌రెడ్డి

image

రాష్ట్రాలు వాటా ఇవ్వకపోవడంతో కొన్ని రైల్వే ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దక్షిణ మధ్య రైల్వేలో 40 స్టేషన్లను ఆధునీకరిస్తామని ఆయన వెల్లడించారు. కాజీపేటలో రూ.680కోట్లతో తయారీ యూనిట్ రాబోతోందన్నారు. రాష్ట్రం నుంచి సహకారం లేకపోయినా రూ.650కోట్లతో MMTS పొడిగిస్తామన్నారు.

Similar News

News January 11, 2026

న్యాయం గొప్పదా? ధర్మం గొప్పదా?

image

సమాజానికి రెండూ అవసరమే. కానీ, న్యాయం కన్నా ధర్మమే గొప్పది, విస్తృతమైనది. ఇది మన అంతరాత్మ, నైతికతకు సంబంధించినది. ఓ వ్యక్తి తన బాధ్యత, కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వహించడమే ధర్మం. ఇదే శాశ్వత సత్యం. న్యాయం కేవలం చట్టబద్ధమైనది. సాక్ష్యాధారాల ఆధారంగా, క్రమశిక్షణ కోసం మనం ఏర్పరుచుకున్నది. న్యాయం పరిస్థితులను బట్టి మారవచ్చు. కానీ ధర్మం అలా కాదు. ఇది మానవత్వాన్ని కాపాడుతుంది. అందుకే ధర్మమే గొప్పది.

News January 11, 2026

డీ హైడ్రేషన్ ఉంటే ఏమవుతుందంటే?

image

డీహైడ్రేషన్ ఊబకాయానికి దారితీస్తుంది. రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు. దీని వల్ల తలనొప్పి, భారంగా అనిపిస్తుంది. తక్కువ నీరు తాగడం వల్ల మూత్రం చిక్కగా మారుతుంది. బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. శరీరంలో నీరు లేకపోవడం రక్త ప్రసరణ ప్రభావితం చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. దీనివల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గి బలహీనత కలుగుతుంది. ముడతలు, మచ్చలు, మొటిమలు కూడా వస్తాయి.

News January 11, 2026

ESIC గువాహటిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>ESIC<<>> మెడికల్ కాలేజీ& హాస్పిటల్, గువాహటిలో 37పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి MBBS, PG,డిప్లొమా, MD/MS/DNB, MSc, PhD అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు జనవరి 21, 22 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ప్రొఫెసర్లకు నెలకు రూ.1,18,500, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.78,800, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.67,700, అలవెన్సులు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://esic.gov.in/