News October 24, 2024
అందుకే రైల్వే ప్రాజెక్టుల ఆలస్యం: కిషన్రెడ్డి

రాష్ట్రాలు వాటా ఇవ్వకపోవడంతో కొన్ని రైల్వే ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. దక్షిణ మధ్య రైల్వేలో 40 స్టేషన్లను ఆధునీకరిస్తామని ఆయన వెల్లడించారు. కాజీపేటలో రూ.680కోట్లతో తయారీ యూనిట్ రాబోతోందన్నారు. రాష్ట్రం నుంచి సహకారం లేకపోయినా రూ.650కోట్లతో MMTS పొడిగిస్తామన్నారు.
Similar News
News December 19, 2025
మంచి ఆదాయ మార్గం.. రాజశ్రీ కోళ్ల పెంపకం

రాజశ్రీ కోళ్లు అధిక రోగ నిరోధక శక్తిని కలిగి తీవ్రమైన వ్యాధులను సైతం తట్టుకుంటాయి. ఇవి తక్కువ సమయంలో అధిక బరువు పెరుగుతాయి. కేవలం 8 వారాల వయసులోనే 500 గ్రాముల బరువు, 20 వారాల వ్యవధిలో రెండున్నర కిలోల వరకు బరువు పెరుగుతాయి. 160 రోజుల వ్యవధిలో గుడ్లను పెట్టడం ప్రారంభించి ఏడాదికి 160-180 గుడ్లు పెడతాయి. మాంసం, గుడ్లు రెండింటి కోసం పెంచేవాళ్లకు రాజశ్రీ మంచి ఎంపిక అంటున్నారు వెటర్నరీ నిపుణులు.
News December 19, 2025
గంభీర్ కోచ్ కాదు.. మేనేజర్: కపిల్ దేవ్

టీమ్ ఇండియాకు గంభీర్ మేనేజర్ మాత్రమేనని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అన్నారు. ‘కోచ్ అనే పదాన్ని అనవసరంగా ఉపయోగిస్తున్నారు. గంభీర్ కోచ్ కాదు.. మేనేజర్ అంతే. లెగ్ స్పిన్నర్ లేదా వికెట్ కీపర్కు గంభీర్ కోచ్ ఎలా అవుతారు. స్కూల్, కాలేజీల్లో నేర్పేవాళ్లు నా దృష్టిలో కోచ్. ఆటగాళ్ల బాగోగులు చూసుకోవడమే ప్రస్తుత కోచ్ పని. వాళ్లను ప్రోత్సహించి, స్ఫూర్తి నింపి, సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి’ అని చెప్పారు.
News December 19, 2025
సచివాలయాలు.. బదిలీల గడువు పొడిగింపు

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల <<18316925>>స్పౌజ్ కేటగిరీ<<>> అంతర్జిల్లా బదిలీల గడువును ప్రభుత్వం ఈ నెల 22 వరకు పొడిగించింది. గత నెల 30లోగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని భావించినా అనివార్య కారణాలతో అధికారులు గడువును పొడిగించారు. భార్యాభర్తల్లో ఎవరైనా ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, వర్సిటీల్లో పనిచేస్తూ ఉంటే బదిలీలకు అర్హులు. మ్యారేజ్ సర్టిఫికెట్, ఎంప్లాయిమెంట్ ఐడీ కార్డు తప్పనిసరి.


