News October 24, 2024

అందుకే రైల్వే ప్రాజెక్టుల ఆలస్యం: కిషన్‌రెడ్డి

image

రాష్ట్రాలు వాటా ఇవ్వకపోవడంతో కొన్ని రైల్వే ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దక్షిణ మధ్య రైల్వేలో 40 స్టేషన్లను ఆధునీకరిస్తామని ఆయన వెల్లడించారు. కాజీపేటలో రూ.680కోట్లతో తయారీ యూనిట్ రాబోతోందన్నారు. రాష్ట్రం నుంచి సహకారం లేకపోయినా రూ.650కోట్లతో MMTS పొడిగిస్తామన్నారు.

Similar News

News December 11, 2025

‘అఖండ-2’ నిర్మాతలకు షాక్.. హైకోర్టులో పిటిషన్

image

TG: ‘అఖండ-2’ సినిమా టికెట్ <<18524262>>ధరల పెంపునకు<<>> అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. న్యాయవాది శ్రీనివాస రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై మరికాసేపట్లో విచారణ జరిగే అవకాశం ఉంది. కాగా రాష్ట్రంలో ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇవాళ రాత్రి ప్రీమియర్లు పడనున్నాయి.

News December 11, 2025

క్యాబినెట్ భేటీకి ఆలస్యం.. మంత్రులపై CM ఆగ్రహం

image

AP: క్యాబినెట్ భేటీకి లేట్‌గా వచ్చిన రామనారాయణ రెడ్డి, సంధ్యారాణి, వాసంశెట్టి సుభాశ్ సహా మరో మంత్రిపై CBN ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘క్యాబినెట్ లాంటి కీలక భేటీకి ఆలస్యం కావడం ఏమిటి? డిసిప్లిన్ లేకపోతే ఎలా?’ అని ప్రశ్నించారు. కమ్యూనికేషన్ లోపంతో ఆలస్యం అయ్యామని మంత్రులు చెప్పగా మళ్లీ రిపీట్ కాకూడదని స్పష్టం చేశారు. కాగా కొందరు మంత్రులు గ్రౌండ్‌వర్క్ చేయడం లేదని CBN అసంతృప్తి వ్యక్తంచేశారని సమాచారం.

News December 11, 2025

చెరువుల్లో నీటి నాణ్యత – చేపలపై ప్రభావం

image

చెరువుల్లో నీరు ఎంత నాణ్యంగా ఉంటే చేపలు అంత ఆరోగ్యంగా, వేగంగా పెరుగుతాయి. నీటి నాణ్యత చెడిపోతే చేపల్లో ఒత్తిడి, వ్యాధులు, మరణాలు సంభవిస్తాయి. చేపలు ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం లీటరు నీటికి 5 మి.గ్రా. DO(డిసాల్వ్ ఆక్సిజన్) ఉండాలి. ఇది 3 మి.గ్రా. కంటే తక్కువైతే చేపలు బలహీనపడతాయి, 1 మి.గ్రా. కన్నా తక్కువైతే చేపలు చనిపోవచ్చు. తెల్లవారుజామున, మబ్బు వాతావరణం, వర్షపు రోజుల్లో డిఓ తక్కువగా ఉంటుంది.