News October 24, 2024
అందుకే లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చారు: జగన్

AP: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో CM చంద్రబాబు ఒక్కటి కూడా నెరవేర్చలేదని జగన్ విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికే లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. గుర్లలో డయేరియాతో చనిపోయిన 14 మంది కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ‘మదనపల్లిలో ఫైల్స్ తగలబడితే DGPని పంపారు. ఇక్కడ ప్రాణాలు పోతుంటే ఒక్క మంత్రి కూడా రాడు’ అని మండిపడ్డారు.
Similar News
News November 4, 2025
12 నెలల పాటు ChatGPT ఫ్రీ.. ఇలా చేయండి

ఓపెన్ ఏఐ కంపెనీ 12 నెలల పాటు ChatGPT సబ్స్క్రిప్షన్ను <<18129528>>ఫ్రీగా<<>> అందిస్తోంది. ఇందుకోసం ఇలా చేయండి.
*ChatGPT యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి.
*యాప్ ఓపెన్ చేయగానే పైన కనిపించే Try Go, Freeపై క్లిక్ చేయాలి
*ఆ తర్వాత Upgrade to Goపై క్లిక్ చేయగానే పేమెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి.
*రూ.2 డెబిట్ అయి వెంటనే క్రెడిట్ అవుతాయి.
NOTE: ప్లాన్ యాక్టివేట్ అయ్యాక ఆటో రెన్యువల్ క్యాన్సిల్ చేయడం మర్చిపోవద్దు.
News November 4, 2025
ప్రభుత్వానికి లిక్కర్ కంపెనీల అల్టిమేటం

TG: పెండింగ్ బకాయిలను చెల్లించకపోతే డిసెంబర్లో మద్యం కొరత, ఆర్థిక విపత్తు తప్పదని లిక్కర్, బేవరేజెస్ కంపెనీల సంఘం ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. ₹3,366 కోట్ల బకాయిలు రాకపోవడంతో ఆర్థిక సమస్యలతో మద్యం తయారీలో ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొంది. బిల్లులు చెల్లించకుంటే మద్యం ఉత్పత్తిని నిలిపివేయడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేసింది.
News November 4, 2025
నలుగురు ఎమ్మెల్యేలను విచారించనున్న స్పీకర్

TG: ఈ నెల 6 నుంచి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ రెండో విడత విచారణ చేపట్టనున్నారు. 6, 12న తెల్లం వెంకట్రావ్, సంజయ్, 7, 13న పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీలను రెండు సార్లు విచారించనున్నారు. తొలుత పిటిషనర్లు, తర్వాత ప్రతివాదులను ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అంతకుముందు తొలి విడతలో <<17912398>>ఇద్దరు<<>> ఎమ్మెల్యేలను విచారించిన సంగతి తెలిసిందే.


