News September 3, 2024
కళ్లను రక్షించే 20-20-20 ఆరోగ్య సూత్రం

సర్వేంద్రియానాం నయనం ప్రధానం. ప్రస్తుతం కంప్యూటర్లు, మొబైళ్లు చూడకుండా క్షణం గడవని పరిస్థితి. స్క్రీన్ టైమ్తో ఒత్తిడి పెరిగి కళ్లు అలసిపోతాయి. దీంతో తలనొప్పి, కంటిచూపు తగ్గడం, పొడిబారడం, ఎరుపెక్కడం, దురద వంటి సమస్యలు వేధిస్తాయి. అందుకే 20-20-20 సూత్రం అనురించాలని వైద్యులు చెబుతున్నారు. 20ని. స్క్రీన్ చూశాక ముఖం తిప్పుకొని 20 ఫీట్ల దూరం 20 సెకన్లు చూస్తే నేత్రాలపై ఒత్తిడి తగ్గుతుందని అంటున్నారు.
Similar News
News November 16, 2025
KG చికెన్ ధర ఎంతంటే?

గత వారంతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరల్లో పెద్దగా మార్పు లేదు. హైదరాబాద్లో స్కిన్ లెస్ కేజీ రూ.210-230 పలుకుతోంది. కామారెడ్డిలో రూ.230-240గా ఉంది. అటు ఏపీలోని విజయవాడలో రూ.250, గుంటూరులో రూ.260, ప.గో. జిల్లా భీమవరంలో రూ.230-250, ఏలూరులో రూ.230కి విక్రయిస్తున్నారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో మటన్ కేజీ రూ.800కు పైగానే ఉంది. మరి మీ ఏరియాలో చికెన్, మటన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News November 16, 2025
కుమారుడి ఫస్ట్ బర్త్డే.. ఫొటో షేర్ చేసిన రోహిత్

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్లో ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న తన కుమారుడు అహాన్ ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోలను ఆయన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ‘సమయం చాలా వేగంగా ముందుకు వెళ్తోంది. కానీ ప్రతి క్షణాన్ని మేము ఆస్వాదిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
News November 16, 2025
ibomma రవి: సీఈవో నుంచి పైరసీ దాకా..

పైరసీ మూవీ వెబ్సైట్ ibomma నిర్వాహకుడు ఇమ్మడి రవి నిన్న అరెస్టయిన విషయం తెలిసిందే. అతడు గతంలో ER ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకి CEOగా పని చేశాడు. ఐదేళ్ల క్రితం భార్యతో విడాకులు తీసుకున్నాడని, తర్వాత పైరసీ రంగంలోకి అడుగుపెట్టాడని తెలుస్తోంది. సర్వర్లను ఈజీగా హ్యాక్ చేయగలిగేలా పట్టు సాధించాడని సమాచారం. అయితే తనను పోలీసులు పసిగట్టరనే ధీమాతో విదేశాల నుంచి కూకట్పల్లికి వచ్చి దొరికిపోయాడు.


