News September 25, 2024
మహిళను 59 ముక్కలుగా నరికిన నిందితుడు ఆత్మహత్య
బెంగళూరుకు చెందిన మహాలక్ష్మి (29) హత్య <<14192326>>కేసు<<>> నిందితుడు ముక్తి రంజన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు అతడి కోసం ఒడిశా వెళ్లి గాలిస్తుండగా కూలేపాడులో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు గుర్తించారు. కాగా మహాలక్ష్మి పని చేస్తున్న ఫ్యాక్టరీలో టీమ్ హెడ్గా ఉన్న రంజన్ కొంతకాలంగా ఆమెతో రిలేషన్లో ఉన్నాడు. మహాలక్ష్మి మరో వ్యక్తితో చనువుగా ఉండటం నచ్చక ఆమెను కిరాతకంగా చంపినట్లు సమాచారం.
Similar News
News September 26, 2024
అద్భుతమైన ఫొటో.. విమానం నుంచి తిరుమల వ్యూ
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన మహిమాన్విత క్షేత్రం తిరుమల. తాజాగా ఓ యువకుడు ఫ్లైట్ నుంచి తిరుమల ఎలా ఉంటుందో ప్రపంచానికి పరిచయం చేశారు. తిరుమల నో ఫ్లయింగ్ జోన్ అని, కానీ అత్యాధునిక లెన్స్ ఉపయోగించి ఈ ఫొటో తీశానని Xలో పేర్కొన్నారు. కొండపై నెలవైన వెంకన్నస్వామి కొలువు ఎంత అద్భుతంగా ఉందో కదా!
PHOTO CREDITS: Prudhvi Chowdary
News September 26, 2024
తిరుమల డిక్లరేషన్ అంటే ఏంటో తెలుసా?
AP: వైఎస్ జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్పై సంతకం చేయాల్సిందేనని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. బ్రిటిష్ హయాం నుంచే అన్యమతస్థులు ఎవరైనా శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఫారంపై సంతకాలు చేసే సంప్రదాయం ఉంది. వేంకటేశ్వరస్వామిపై తమకు నమ్మకం, గౌరవం ఉందని, దర్శనానికి అనుమతించాలని అందులో సంతకం చేయాలి. 1933 ముందు వరకు మహంతులు దీన్ని పర్యవేక్షించారు.
News September 26, 2024
డిక్లరేషన్ ఇచ్చాకే జగన్ దర్శనానికి వెళ్లాలి: పురందీశ్వరి
AP: టీటీడీ అధికారులకు డిక్లరేషన్ సమర్పించిన తర్వాతే శ్రీవారి దర్శనానికి వైసీపీ చీఫ్ జగన్ వెళ్లాలని ఏపీ బీజేపీ చీఫ్ పురందీశ్వరి డిమాండ్ చేశారు. జగన్ అన్యమతస్థుడు కావడంతో దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని ట్వీట్ చేశారు. నడక ప్రారంభానికి ముందు అలిపిరి వద్ద జగన్ తన విశ్వాసాన్ని ప్రకటించాలన్నారు. కాగా ఈ నెల 27న సాయంత్రం మెట్ల మార్గంలో జగన్ తిరుమల వెళ్లనున్నారు.