News August 24, 2024
ట్రైనీ డాక్టర్పై హత్యాచారం.. ట్విస్ట్ ఇచ్చిన నిందితుడు

కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై హత్యాచార ఘటనలో నిందితుడైన <<13913228>>సంజయ్<<>> రాయ్ CBI కోర్టులో సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. పాలీగ్రాఫ్ టెస్టుకు ఎందుకు సమ్మతించావని మెజిస్ట్రేట్ ప్రశ్నించగా.. అతడు భావోద్వేగానికి గురైనట్లు తెలిసింది. ‘నేను అమాయకుడిని. ఏ తప్పూ చేయలేదు. నన్ను ఇరికించారు. ఈ పరీక్షతో అసలు విషయం బయటపడుతుంది’ అని జడ్జి ముందు కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. దీంతో ఈ కేసులో ట్విస్ట్ నెలకొంది.
Similar News
News November 8, 2025
ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను ప్రారంభించిన చైనా

చైనా తమ మూడో విమాన వాహక యుద్ధ నౌక ఫుజియాన్ను రహస్యంగా ప్రారంభించింది. బుధవారం చైనాలోని సాన్యా పోర్టులో అధ్యక్షుడు జిన్ పింగ్ దీనిని ప్రారంభించినట్లు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ‘జిన్హువా’ పేర్కొంది. కానీ, అధికారిక మీడియా మాత్రం ఫుజియాన్ను శుక్రవారం ప్రారంభించినట్లు పేర్కొంది. చైనా తీసుకొచ్చిన లియావోనింగ్(2012), షాన్డాంగ్(2019) కంటే ఇది పెద్దదని, దీని బరువు 80 వేల టన్నులని తెలుస్తోంది.
News November 8, 2025
పైలట్ను నిందించలేం: సుప్రీంకోర్టు

అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా క్రాష్కి సంబంధించి పైలట్ను నిందిచలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రమాదంలో చనిపోయిన మెయిన్ పైలట్ సుమిత్ తండ్రి దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం.. DGCA, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ‘ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరం. మీ కుమారుడిని ఎవరూ నిందిచలేరు. పైలట్ తప్పు వల్లే ప్రమాదం జరిగిందని దేశంలో ఎవరూ భావించడం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
News November 8, 2025
సంకటహర గణపతి వ్రతం ఎలా చేయాలంటే..?

నల్ల నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయాలి. గణపతి పూజ చేసి, ఎర్ర గుడ్డలో పసుపు, కుంకుమ, బియ్యం, ఖర్జూరం, వక్కలు, దక్షిణ వేసి ముడుపు కట్టి, కోరిక మనసులో అనుకొని 21 ప్రదక్షిణలు చేయాలి. ఉపవాసం, మౌనంగా ఉంటూ గణపతిని కొలవాలి. సాయంత్రం దీపాలు పెట్టాలి. ముడుపు బియ్యంతో బెల్లం పాయసం, ఉండ్రాళ్లతో నైవేద్యం పెట్టాలి. వ్రతానికి ముందు రోజు, తర్వాత రోజు కూడా మద్యమాంసాలు ముట్టొద్దు. మరుసటి రోజు హోమం చేస్తే శుభం.


