News September 21, 2024

కొత్తదారులు వెతకడమే ‘బైడెన్, మోదీ మీటింగ్’ ఎజెండా

image

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, అభివృద్ధి, శ్రేయస్సు కోసం ఏర్పడిన కీలక దేశాల కూటమే క్వాడ్ అని PM మోదీ అన్నారు. అమెరికాకు బయల్దేరే ముందు ఆయన మాట్లాడారు. ‘క్వాడ్ సమ్మిట్లో ప్రెసిడెంట్ బైడెన్, PM అల్బనీస్, PM కిషిదాను కలిసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. ప్రపంచం మేలు, మన ప్రజల ప్రయోజనం కోసం IND-US అంతర్జాతీయ భాగస్వామ్యం మరింత బలోపేతానికి కొత్త మార్గాలను బైడెన్‌తో సమావేశంలో అన్వేషిస్తాం’ అని అన్నారు.

Similar News

News September 21, 2024

లడ్డూపై సాయంత్రం ఈవో నివేదిక

image

AP: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈవో శ్యామలారావు ఇవాళ సాయంత్రం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. దాని ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసినట్లు రిపోర్ట్ రావడంతో సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు టీటీడీ ఈవోను ఆదేశించారు. ఇప్పటికే ఆలయ శుద్ధి, సంప్రోక్షణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

News September 21, 2024

INDvBAN: వరుణుడి పలకరింపు

image

భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ జరుగుతున్న చిదంబరం స్టేడియంలో రాత్రి, తెల్లవారుజామున వర్షం కురిసింది. దీంతో మైదానంపై కవర్స్ కప్పారు. ప్రస్తుతం వర్షం లేకపోవడంతో కవర్స్‌ను తొలగించారు. ఆటగాళ్లు గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. అటు ఇప్పటికే 321 రన్స్ ఆధిక్యంలో ఉన్న భారత భారీ స్కోర్ చేస్తే ఈరోజు మ్యాచ్‌ను గెలిచే ఛాన్స్ ఉంది.

News September 21, 2024

నటి జెత్వానీ కేసు.. నేడు విజయవాడకు విద్యాసాగర్ తరలింపు

image

AP: ముంబై నటి జెత్వానీని వేధించిన కేసులో అరెస్టయిన కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు నేడు విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నారు. నిన్న డెహ్రాడూన్‌లో అతడిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు, ముందుగా అక్కడి కోర్టులో హాజరుపరిచారు. ట్రాన్సిట్ వారెంట్‌పై ఇవాళ విజయవాడకు తీసుకురానున్నారు.