News April 5, 2024
లోక్సభ ఎన్నికల్లో తగ్గిన స్వతంత్రుల హవా!

లోక్సభ ఎన్నికల్లో స్వతంత్రుల హవా క్రమంగా తగ్గిపోయింది. 1991 నుంచి పోటీ చేసిన వారిలో 99% మంది డిపాజిట్లు కోల్పోయారు. 1951-52లో 6.9% మంది స్వతంత్రులు ఎంపీలుగా గెలిచారు. 1957లో 8.7%, 1962లో 4.2%, 1984లో 0.30%, 2019లో 0.11% మంది మాత్రమే గెలుపొందారు. 1951-52లో 533 మంది పోటీ చేయగా 37 మంది గెలిచారు. 2019 ఎన్నికల్లో 8,000 మంది పోటీ చేయగా నలుగురే ఎన్నికయ్యారు. <<-se>>#Elections2024<<>>
Similar News
News January 5, 2026
ప్రాణాలు కాపాడుకొని.. సవాల్ విసరాలని!

మార్చి 31 నాటికి మావోయిజాన్ని అంతం చేస్తామన్న కేంద్రం ఆపరేషన్ కగార్ చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో ఎంతోమంది కీలక నేతలు మరణించగా అనేక మంది లొంగిపోయారు. ప్రస్తుతం దళంలో కొంతమందే మిగిలారు. అయితే డెడ్లైన్ నాటికి ప్రాణాలు కాపాడుకొని తమను నిర్మూలించలేరంటూ కేంద్రానికి సవాల్ విసరాలని వారు భావిస్తున్నట్లు సమాచారం. తిప్పిరి తిరుపతి సారథ్యంలోని దళాలు బలగాల కంటికి చిక్కకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాయి.
News January 5, 2026
నల్లమలసాగర్ ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్ కేసుపై నేడు సుప్రీంలో విచారణ

TG: ఏపీ ప్రతిపాదించిన పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఈరోజు విచారించనుంది. అనుమతుల్లేకుండా చేపడుతున్న ఈ పనులపై బలమైన వాదనలు వినిపించాలని న్యాయవాది అభిషేక్ సింఘ్వీకి సీఎం రేవంత్ సూచించారు. అటు ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావును విచారించేందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వం వేసిన పిటిషన్పైనా నేడు విచారణ జరగనుంది.
News January 5, 2026
ESIC నవీ ముంబైలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<


