News March 27, 2024
167 మంది అభ్యర్థులను ప్రకటించిన కూటమి

AP: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి సిద్ధమవుతోంది. అందులో భాగంగా మొత్తం 175 స్థానాలకు గానూ 167 మంది అభ్యర్థులను ఎన్డీఏ కూటమి ప్రకటించింది. టీడీపీ ఐదు స్థానాలు, జనసేన మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News January 19, 2026
మీ షూ కీళ్లను దెబ్బతీస్తున్నాయా?

షూ ఎంచుకునేటప్పుడు కేవలం లుక్స్ మాత్రమే చూస్తాం. కానీ రాంగ్ ఫుట్వేర్ వల్ల మోకాళ్లు, నడుము నొప్పి వచ్చే ఛాన్స్ ఉంది. ముంబై డాక్టర్ మనన్ వోరా ప్రకారం.. మరీ ఫ్లాట్ షూ కాకుండా Slight Heel ఉన్నవి వాడాలి. ఇవి కీళ్లపై ప్రెజర్ తగ్గిస్తాయి. రన్నింగ్కు కుషనింగ్ ఉన్న షూ, జిమ్ వర్కౌట్స్కు ఫ్లాట్ సోల్ బెస్ట్. మీ Arch typeని బట్టి కరెక్ట్ సైజులో ఉండేలా చూసుకోవాలి. స్టైల్ కోసం హెల్త్ రిస్క్ చేయొద్దు.
News January 19, 2026
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నితిన్ నబీన్ను ప్రతిపాదిస్తూ 37 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు ఉ.11 గంటలకు ఢిల్లీలోని పార్టీ ఆఫీసులో ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నట్లు సమాచారం.
News January 19, 2026
WOW.. వైర్లు లేకుండానే విద్యుత్ సరఫరా!

వైర్లు లేకుండానే గాలిలో కరెంట్ను పంపి ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు సంచలనం సృష్టించారు. హెల్సింకి, ఔలు యూనివర్సిటీల శాస్త్రవేత్తలు అల్ట్రాసోనిక్ ధ్వని తరంగాలు, లేజర్ కిరణాల సహాయంతో విద్యుత్తును ఒక చోటు నుంచి మరోచోటుకు విజయవంతంగా పంపారు. ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ ‘అకౌస్టిక్ వైర్’ టెక్నాలజీ వల్ల ఫ్యూచర్లో ప్లగ్, వైర్ల అవసరం తగ్గుతుంది. Wi-Fi లాగే రేడియో తరంగాల ద్వారా పరికరాలకు విద్యుత్ సరఫరా అందనుంది.


