News January 19, 2025

కూటమి మాట నిలబెట్టుకోవాలి.. లేదంటే ఉద్యమం: బొత్స

image

AP: విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగదని మోదీ, అమిత్ షా, చంద్రబాబు ఎందుకు చెప్పట్లేదని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే రూ.11వేల కోట్ల ప్యాకేజీకి ఎన్నో షరతులు పెట్టారన్నారు. దీనివెనుక ఏదో మతలబు ఉందని కార్మికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రైవేటీకరణ జరగకుండా కూటమి నేతలు మాట నిలబెట్టుకోవాలని, లేదంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

Similar News

News December 20, 2025

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మరికొంతమంది ప్రముఖుల పేర్లు

image

US లైంగిక నేరగాడు <<18618704>>ఎప్‌స్టీన్<<>> కాంటాక్ట్ బుక్‌లో పలువురు ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత Dr.ఎలీ వీజెల్, వార్నర్ మ్యూజిక్ గ్రూప్ మాజీ CEO బ్రోన్ఫ్‌మాన్, UK మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, స్పెయిన్ మాజీ ప్రధాని జోస్ అజ్నార్‌తో పాటు పలువురు రాజకీయ, మీడియా రంగ దిగ్గజాలు ఉన్నారు. అయితే పేర్లు ఉన్నంతమాత్రాన వాళ్లు నేరం చేసినట్లు కాదని DOJ స్పష్టం చేసింది.

News December 20, 2025

AIIMS పట్నా 117 పోస్టులకు నోటిఫికేషన్

image

AIIMS పట్నా 117 సీనియర్ రెసిడెంట్ (నాన్ అకడమిక్) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు జనవరి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS/MD/MS/DNB/DM/M.Ch ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://api.aiimspatna.edu.in/

News December 20, 2025

నేడు బీజేపీలో చేరనున్న నటి ఆమని

image

TG: నటి ఆమని ఇవాళ బీజేపీలో చేరనున్నారు. TBJP అధ్యక్షుడు రామ్‌చందర్ రావు ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన ఆమని తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ సినిమాలు, టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నారు. అటు మరో సీనియర్ నటి మీనా కూడా బీజేపీలో చేరతారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆమె అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు.