News July 31, 2024

ఉ.5.30కే మెట్రో ప్రారంభించాలని ప్రయాణికుల విజ్ఞప్తి

image

HYD మెట్రో ప్రయాణికులకు నిరాశే ఎదురైంది. ఇవాళ్టి నుంచి ఉ.5.30 గంటలకే మెట్రో సేవలు ప్రారంభం అవుతాయని అధికారులు చెప్పినా, క్షేత్రస్థాయిలో అమలు కాలేదు. ఇవాళ ఉ.6 గంటల తర్వాతే నాగోల్‌లో తొలి రైలు బయల్దేరింది. ఉ.5.40 తర్వాతే మెట్రో సిబ్బంది విధులకు హాజరయ్యారు. టైమింగ్స్ మార్పుపై తమకు అధికారిక ఆదేశాలు రాలేదని సిబ్బంది చెబుతున్నారు. అటు ఉ.5.30కే రైళ్లు స్టార్ట్ చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Similar News

News December 8, 2025

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ షెడ్యూల్

image

*ఇవాళ 1.30PMకు గవర్నర్ ఈ సదస్సును ప్రారంభిస్తారు
*ప్రజాపాలన, రెండేళ్లలో సాధించిన ప్రగతి, భవిష్యత్ ప్రణాళికలను సీఎం రేవంత్ రెడ్డి గెస్టులకు వివరిస్తారు
*3PM-7PM వరకు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి, కొరియా బృందం, ట్రంప్ మీడియా ప్రతినిధులు, అమెజాన్, ఐకియా, వరల్డ్ బ్యాంక్, SIDBI సహా వివిధ రకాల పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ అవుతారు.

News December 8, 2025

హీరోయిన్‌కు వేధింపులు.. మలయాళ నటుడిని నిర్దోషిగా తేల్చిన కోర్టు

image

హీరోయిన్‌పై లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్‌ను కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఈ మేరకు కేరళలోని ఎర్నాకులం జిల్లా సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. ఆరుగురు నిందితులను దోషులుగా నిర్ధారించింది. వారికి శిక్షను ఈనెల 12న ప్రకటించనుంది. 2017లో సినీ నటిపై వేధింపుల కేసులో దిలీప్ అరెస్టయ్యారు. కొన్నాళ్లు జైలు జీవితం గడిపారు. దాదాపు 8 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ జరిగింది.

News December 8, 2025

ఇండిగో సంక్షోభం.. అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో

image

ఇండిగో విమానాల సంక్షోభంపై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం ఇప్పటికే దీనిపై చర్యలు తీసుకుంటోందని తెలిపింది. ఈ సమయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అయితే ఇది తీవ్రమైన సమస్య అని, లక్షలాది మంది బాధితులు ఉన్నారని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా విమానాల రద్దుపై ఈ పిల్ దాఖలైంది.