News April 24, 2024

TDP ఎంపీ అభ్యర్థి ఆస్తులు రూ.5,785 కోట్లు

image

AP: గుంటూరు పార్లమెంట్ TDP అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ దేశంలోనే అత్యంత ధనిక MP అభ్యర్థిగా నిలుస్తున్నారు. తన కుటుంబానికి రూ.5,785.28 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించారు. అందులో చరాస్తుల విలువ ₹5,598.65 కోట్లు కాగా స్థిరాస్తులు ₹186.63cr. ఇక అప్పులు ₹1,038 కోట్లు ఉన్నట్లు తెలిపారు. వైద్యుడైన చంద్రశేఖర్‌ అమెరికాలో వైద్యవృత్తితో పాటు వివిధ వ్యాపారాల్లో సక్సెస్ అయ్యారు.

Similar News

News December 19, 2025

ఇంట్లో వాళ్లతో పోటీ పడటం కష్టంగా ఉంది: లోకేశ్

image

AP: ఎన్నికల్లో పోటీ చేయడం కంటే తనకు ఇంట్లో వాళ్లతో పోటీ పడటం కష్టంగా ఉందని మంత్రి లోకేశ్ అన్నారు. ‘‘తండ్రి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నారు. తల్లికి ‘గోల్డెన్ పీకాక్ అవార్డు’ వచ్చింది. భార్య ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజిజెస్’ అవార్డ్ గెలిచింది’’ అని ట్వీట్ చేశారు. తన కుమరుడు దేవాన్ష్ కూడా చెస్ ఛాంపియన్ అని పేర్కొన్నారు. ఈ పోటీ తరతరాలుగా కొనసాగుతూనే ఉందని చెప్పారు.

News December 19, 2025

తరచూ తలనొప్పా! ఈ తప్పులు చేస్తున్నారా?

image

శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల మెదడు కుంచించుకుపోయి తలనొప్పి వస్తుంది. భోజనం స్కిప్ చేసినా సమస్య రావచ్చు. స్వీట్స్, పలు పిండి పదార్థాలు తిన్నప్పుడు కొందరికి ఈ ఇబ్బంది వస్తుంది. సరిగ్గా కూర్చోకపోయినా, ఎక్కువసేపు నిలబడినా కండరాలు ఒత్తిడికిగురై సమస్య రావచ్చు. పడుకునే ముందు గట్టిగా ఉన్న ఫుడ్ తిన్నా, నిద్రలో పళ్లు కొరికినా, రాత్రుళ్లు స్మోకింగ్, డ్రింకింగ్‌, నాణ్యతలేని నిద్ర తలనొప్పికి కారణం కావచ్చు.

News December 19, 2025

రాజ్యసభలోనూ VB-G RAM G బిల్లుకు ఆమోదం!

image

ప్రతిపక్షాల నిరసనల నడుమ రాజ్యసభలో VB-G RAM G బిల్లు ఆమోదం పొందింది. కాగా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలనే డిమాండ్‌తో ప్రతిపక్ష MPలు వాకౌట్ చేశారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ మాట్లాడుతూ.. పేదల సంక్షేమంలో ఈ బిల్లు కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మహాత్మా గాంధీ ఆదర్శాలను కాంగ్రెస్ అగౌరపరుస్తోందని మండిపడ్డారు. మరోవైపు ఈ చట్టాన్ని BJP వెనక్కి తీసుకొనే రోజు వస్తుందని మల్లికార్జున ఖర్గే చెప్పారు.