News April 24, 2024

TDP ఎంపీ అభ్యర్థి ఆస్తులు రూ.5,785 కోట్లు

image

AP: గుంటూరు పార్లమెంట్ TDP అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ దేశంలోనే అత్యంత ధనిక MP అభ్యర్థిగా నిలుస్తున్నారు. తన కుటుంబానికి రూ.5,785.28 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించారు. అందులో చరాస్తుల విలువ ₹5,598.65 కోట్లు కాగా స్థిరాస్తులు ₹186.63cr. ఇక అప్పులు ₹1,038 కోట్లు ఉన్నట్లు తెలిపారు. వైద్యుడైన చంద్రశేఖర్‌ అమెరికాలో వైద్యవృత్తితో పాటు వివిధ వ్యాపారాల్లో సక్సెస్ అయ్యారు.

Similar News

News December 9, 2025

స్వాతంత్ర్య సమరాన్ని BJP వ్యతిరేకించింది: ఖర్గే

image

స్వాతంత్ర్య సమరం, దేశభక్తి గీతాలను వ్యతిరేకించిన చరిత్ర బీజేపీదని AICC చీఫ్ ఖర్గే విమర్శించారు. ‘గాంధీ పిలుపునిచ్చిన సహాయ నిరాకరణ ఉద్యమంలో వందేమాతరం అంటూ లక్షల మంది స్వాతంత్ర్య సమరయోధులు జైలుకు వెళ్లారు. అప్పుడు BJP సిద్ధాంతకర్తలు బ్రిటీషర్ల కోసం పనిచేస్తున్నారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పిలుపునిచ్చిన వందేమాతరం ఉద్యమంలో కాంగ్రెస్ కీలకంగా వ్యవహరించింది’ అని ఖర్గే రాజ్యసభలో వ్యాఖ్యానించారు.

News December 9, 2025

జామపండు తింటే ఎన్నో లాభాలు!

image

మార్కెట్‌లో విరివిగా లభించే జామపండును పోషకాల పవర్ హౌస్ అని పిలుస్తారు. ఇది నారింజ కంటే 4 రెట్లు అధికంగా విటమిన్ C అందించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉన్న పీచుపదార్థం చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. కేవలం 60-70క్యాలరీలు మాత్రమే ఉండటం వల్ల బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. దేశీయ సూపర్ ఫ్రూట్ అయిన జామను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. share it

News December 9, 2025

ఘోర అగ్నిప్రమాదం.. 20 మంది మృతి

image

ఇటీవల తుఫాన్ బీభత్సంతో అతలాకుతలమైన ఇండోనేషియాలో మరో ఘోర ప్రమాదం సంభవించింది. రాజధాని జకార్తాలో ఓ ఏడంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం జరిగి 20 మంది మరణించారు. మరికొంత మంది గాయపడ్డారు. ఏరియల్ సర్వే కోసం ఉపయోగించే డ్రోన్ల తయారీ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్‌లో మొదలైన మంటలు వెంటనే భవనమంతా వ్యాపించాయి. ఆ సమయంలో కొందరు ఉద్యోగులు భోజనం చేస్తున్నారు. మంటలు చుట్టుముట్టడంతో వారంతా సజీవదహనం అయ్యారు.