News July 19, 2024
ఇంటికి తాళం వేసిన బ్యాంకు అధికారులు.. వ్యక్తి సూసైడ్

లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులకు బెంగళూరుకు చెందిన ఇద్దరు పిల్లల తండ్రి గౌరీ శంకర్ శర్మ బలయ్యారు. దీనిపై శర్మ బంధువు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన శర్మ గత 18 నెలలుగా హౌస్ లోన్ EMI చెల్లించలేదు. EMI చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు అపార్ట్మెంట్లోకి చొరబడి ఇంటికి తాళం వేసి అవమానించారు. అందుకే శర్మ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Similar News
News November 19, 2025
‘అరట్టై’ నుంచి బిగ్ అప్డేట్..

దేశీ మెసేజింగ్ యాప్ ‘అరట్టై’లో బిగ్ అప్డేట్ను జోహో సంస్థ తీసుకొచ్చింది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ను ప్రవేశపెట్టింది. ఇకపై డైరెక్ట్ చాట్లకు ఎన్క్రిప్షన్ రక్షణ ఉంటుందని జోహో తెలిపింది. కొత్త వెర్షన్ను అప్డేట్ చేసుకోవాలని యూజర్లను కోరింది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వల్ల మెసేజ్ను పంపినవారు, రిసీవ్ చేసుకున్న వారే చూస్తారని చెప్పింది. గ్రూప్ చాట్స్కూ త్వరలో అందుబాటులోకి తెస్తామని పేర్కొంది.
News November 19, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 19, 2025
AIని గుడ్డిగా నమ్మవద్దు: సుందర్ పిచాయ్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఇచ్చే సమాధానాలను గుడ్డిగా నమ్మవద్దని గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. AI కూడా తప్పులు చేసే అవకాశం ఉందని, ఇతర టూల్స్లో సమాచారాన్ని వెరిఫై చేసుకోవాలని చెప్పారు. విభిన్న మాధ్యమాలతో కూడిన సమాచార వ్యవస్థ ఉండటం ముఖ్యమని తెలిపారు. ఏఐ పెట్టుబడుల ‘బబుల్’ ఏ దశలోనైనా విస్ఫోటనం చెందవచ్చని, ఈ విషయంలో కంపెనీలు అప్రమత్తంగా ఉండాలని BBC ఇంటర్వ్యూలో సూచించారు.


