News March 26, 2025

బీఆర్ఎస్ చేసిన అతి పెద్ద స్కామ్ ‘మన ఊరు-మన బడి’: అక్బరుద్దీన్

image

TG: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం కాళేశ్వరం కంటే పెద్ద కుంభకోణమని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ‘బీఆర్ఎస్ చేసిన మిగతా స్కామ్స్ అన్నీ చాలా చిన్నవి. మన ఊరు-మన బడి కుంభకోణంపై కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపించాలి. 4823 ప్రభుత్వ స్కూళ్లలో మరుగుదొడ్లు లేవు. బాలికలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

Similar News

News November 28, 2025

ఖమ్మం: కేంద్రం వద్ద పెండింగ్‌ సమస్యలపై ఎంపీ చర్చ

image

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశానికి ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి హాజరయ్యారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించారు. ముఖ్యంగా డోర్నకల్-మిర్యాలగూడ రైల్వే లైన్ అలైన్‌మెంట్‌ను మార్చాలని, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని గురుకులాలు, జాతీయ రహదారుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీ తెలిపారు.

News November 28, 2025

మరోసారి మెగా పీటీఎం

image

AP: మరోసారి మెగా పేరెంట్-టీచర్స్ మీట్ నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. DEC 5న జూనియర్ కాలేజీలతో పాటు 45వేల ప్రభుత్వ బడుల్లో ఈ ప్రోగ్రాం జరగనుంది. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను చూపించి తల్లిదండ్రులతో క్లాస్ టీచర్ మాట్లాడనున్నారు. మంత్రి లోకేశ్ మన్యం జిల్లాలో నిర్వహించే మెగా పీటీఎం‌లో పాల్గొంటారు. గతేడాది మొదటిసారి, ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో రెండోది, వచ్చే నెల మూడో మెగా పీటీఎం జరగనుంది.

News November 28, 2025

వైకుంఠ ద్వార దర్శనం: లక్కీ డిప్‌లో సెలెక్ట్ అవ్వకపోతే..?

image

వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు ఉంటుంది. అందులో మొదటి 3 రోజులు మాత్రమే లక్కీ డిప్ ద్వారా భక్తులను ఎంపిక చేస్తారు. లక్కీ డిప్‌లో సెలక్ట్ అవ్వని భక్తులకు నిరాశ అనవసరం. JAN 2 – JAN 8వ వరకు రోజుకు 15K చొప్పున విడుదలయ్యే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. వీటిని బుక్ చేసుకున్న అందరికీ వైకుంఠ ద్వారం గుండా దర్శనం లభిస్తుంది. ఇవి DEC 5న విడుదలవుతాయి. ఫాస్ట్‌గా బుక్ చేసుకోవాలి.