News February 24, 2025

క్రిప్టో కరెన్సీ చరిత్రలో అతి పెద్ద చోరీ

image

దుబాయ్‌కు చెందిన క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ కంపెనీ బైబిట్‌ నుంచి 1.5బిలియన్ డాలర్ల డిజిటల్ సొమ్ము(ఇథేరియం)ను హ్యాకర్లు చోరీ చేశారు. ఆన్‌లైన్ ఛాటింగ్‌లో లావాదేవీల సమయంలో ఇది జరిగిందని, యూజర్ల ఫండ్స్‌కు ఎటువంటి ఢోకా లేదని బైబిట్ CEO బెన్ జొహవు భరోసా కల్పించారు. చోరీకి గురైన 400,000 ETHలను నష్టపోయిన యూజర్లకు పూర్తిగా రీఫండ్ చేస్తామని వెల్లడించారు. బిట్ కాయిన్ అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఇథేరియం.

Similar News

News November 26, 2025

HYD: ఇంద్రజాల్ డ్రోన్ వాహనం ఇదే!

image

ఇంద్రజాల్ రేంజర్ వాహనాన్ని రాయదుర్గం టీ హబ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఇంద్రజాల్ రేంజర్ వాహనం అనుమానాస్పద డ్రోన్లను కూల్చేస్తుందని, 6 రోజుల్లో 70 డ్రోన్లను నిర్వీర్యం చేసిందని, ఈ వాహనం 10 కిలోమీటర్ల రేడియస్‌లో పనిచేస్తుందన్నారు. ఈ వాహనం డిఫెన్స్ డ్రోన్ కాకుండా డ్రగ్స్ తీసుకొస్తున్న డ్రోన్స్‌ను కూడా నిర్వీర్యం చేస్తుందని డ్రోన్ డిఫెన్స్ ఇండియా సీఈవో కిరణ్ రాజు తెలిపారు.

News November 26, 2025

భట్టి కుమారుడి ఎంగేజ్‌మెంట్.. హాజరైన సీఎం

image

TG: హైదరాబాద్‌లో జరిగిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య నిశ్చితార్థ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సతీమణి, కూతురు, అల్లుడితో కలిసి వచ్చిన సీఎం.. కాబోయే వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు చెప్పారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, ముఖ్య నేతలు, అధికారులు ఈ వేడుకకు హాజరయ్యారు.

News November 26, 2025

RRR కేసు.. సునీల్ కుమార్‌కు సిట్ నోటీసులు

image

AP: రఘురామ కృష్ణరాజును కస్టడీలో హింసించిన కేసులో IPS అధికారి, సీఐడీ మాజీ చీఫ్ PV సునీల్‌కుమార్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. DEC 4న జరిగే విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. 2021లో రాజద్రోహం కేసులో తనను అరెస్టు చేసిన సీఐడీ అధికారులు.. కస్టడీలో చంపేందుకు ప్రయత్నించారని RRR 2024లో గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సునీల్ కుమార్‌తో పాటు మాజీ సీఎం జగన్, మరికొందరిని నిందితులుగా చేర్చారు.